Agnipath: అగ్నివీరులకు అండగా ఉంటామంటున్న భారత కార్పొరేట్ దిగ్గజాలు.. ఏమంటున్నారంటే..
Agnipath: ప్రస్తుతం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ ప్రదర్శనలపై విచారం వ్యక్తం చేశారు. ఇంతలో.. అగ్నిపథ్ నుంచి తిరిగి వచ్చే వారికి తన కంపెనీలో ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించారు. వీరితో పాటు దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు సైతం ప్రస్తుతం అగ్నివీరుల కోసం తమ కంపెనీ తలుపులు తెరుస్తున్నారు. వీరిలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్, చంద్రశేఖరన్ కూడా చేరారు. అగ్నిపథ్ పథకాన్ని ఆయన ప్రశంసించారు.
ఆనంద్ మహీంద్రా..
క్రమశిక్షణ, నైపుణ్యం కలిగిన అగ్నివీరులకు తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ కూడా రాశారు. 'అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింస చాలా బాధాకరమన్నారు. గత సంవత్సరం ఈ పథకంపై చర్చ ప్రారంభమైనప్పుడు, క్రమశిక్ష, నైపుణ్యం కలిగిన అగ్నివీరులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తాను అప్పుడు, ఇప్పుడు మళ్లీ చెబుతున్నానన్నారు. ఇలాంటి పోకడలు, సామర్థ్యాలు ఉన్న యువతకు మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నారు. ఇదే క్రమంలో అగ్నివర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టాటా గ్రూప్ తాజాగా ప్రకటించింది.
టాటా గ్రూప్..
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖర్ నేతృత్వంలోని దేశీయ కంపెనీలు కేంద్ర 'అగ్నిపథ్' కార్యక్రమానికి మద్దతు ఇచ్చాయి, ఈ పథకం పరిశ్రమకు క్రమశిక్ష, శిక్షణ పొందిన శ్రామిక శక్తిని అందించడానికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ''దేశ రక్షణ దళాలకు సేవ చేసేందుకు యువతకు అగ్నిపథ్ గొప్ప అవకాశం మాత్రమే కాదు, టాటా గ్రూప్తో సహా పరిశ్రమకు అత్యంత క్రమశిక్షణ, శిక్షణ పొందిన యువతను కూడా అందిస్తుంది'' అని అన్నారు. టాటా గ్రూప్ 'అగ్నివీరుల' సామర్థ్యాన్ని గుర్తించి.. వారికి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు.
హర్ష్ గోయెంకా.. కిరణ్ మజుందార్ షా..
హర్ష్ గోయెంకా కూడా కంపెనీ తలుపులు తెరిచారు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేస్తూ - "RPG గ్రూప్ అగ్నివీర్స్ను ఉపయోగించుకునే అవకాశాన్ని స్వాగతించిందని వెళ్లడించారు. ఇతర కంపెనీలు కూడా మాతో చేరి దేశ యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. కిరణ్ మజుందార్ షా సైతం ఈ విషయంలో ముందుకొచ్చారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనల మధ్య, కిరణ్ మజుందార్ షా ట్వీట్ కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. హర్ష్ గోయెంకా ట్వీట్కు ప్రత్యుత్తరం ఇస్తూ- 'ఇండస్ట్రియల్ జాబ్ మార్కెట్లో అగ్నివీర్లకు మంచి ప్రయోజనాలు లభిస్తాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నారు. పరిశ్రమల్లో తనకు ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తాయనేది ఆయన ఉద్దేశ్యం. Naukri.com యాజమాన్యంలోని సంస్థ ఇన్ఫో ఎడ్జ్ ఛైర్మన్ సంజీవ్ బిఖ్చందానీ కూడా అగ్నివీరులకు తలుపులు తెరిచారు. సాయుధ దళాలు శిక్షణకు ఉత్తమమైన ప్రదేశమని సంజీవ్ చెప్పారు. ఎవరైనా అందులో 4 సంవత్సరాలు శిక్షణ తీసుకుంటే, అతను క్రమశిక్షణ, మెరుగైన శిక్షణతో తిరిగి వస్తాడన్నారు. అతను కళాశాల డిగ్రీని కూడా కలిగి ఉంటాడు. అగ్నిపథ్ పథకం మంచిదని, దానిని వ్యతిరేకించవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు.
దేశవ్యాప్తంగా చెలరేగిన దుమారం..
కానీ ఈ వ్యవహారంపై.. దేశవ్యాప్తంగా నిరసనలు, అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ, యూపీ, బీహార్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల, నిరసనలు చాలా తీవ్రంగా మారాయి. అనేక రైళ్లను తగులబెట్టారు, వాహనాలకు నిప్పు పెట్టారు. చాలా ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది దాదాపు 46 వేల మంది అగ్నివీరులను రిక్రూట్ చేసుకోనున్నారు. అయితే భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుకోవచ్చని ఒక ఉన్నత సైనిక అధికారి తెలిపారు. ఈ తరుణంలో పథకంపై అపోహలను తొలగించేందుకు కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.