Har Ghar Tiranga: ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో కలిసి ఉన్న చిత్రంలో కనిపిస్తున్న ఈ మహిళ ఎవరు? ఈ ప్రసిద్ధ వ్యాపారవేత్తలకు ఆమె త్రివర్ణ పతాకాన్ని ఎందుకు ఇస్తోంది? ఈ ప్రశ్నలు మీ మదిలో మెదులుతున్నాయి కదూ. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

75వ స్వాతంత్ర్య దినోత్సవం
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారాన్ని ప్రారంభించారు. కనీసం 20 కోట్ల ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. .

హర్ ఘర్ తిరంగా ప్రచారం..
చిత్రంలో వ్యాపారవేత్తలైన ఆనంద్ మహీంద్రా, రతన్ టాటాలతో కలిసి ఉన్న మహిళ పైరు స్వాతి పాండే. ముంబై పోస్ట్ మాస్టర్ జనరల్ (PMG)గా ఉన్న ఆమె.. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు త్రివర్ణ పతాకాన్ని ఇవ్వడానికి ఆమె వచ్చారు.
స్వాతి పాండే ఎవరు?
స్వాతి సీనియర్ బ్యూరోక్రాట్. ఆమె ప్రస్తుతం పోస్ట్ మాస్టర్ జనరల్ హోదాలో ఇండియా పోస్ట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి సీఈవోగా కూడా పనిచేశారు. ఇక్కడ ఆమె ఏప్రిల్ 2016-మార్చి 2018 వరకు ఉన్నారు. ఇది కాకుండా ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)గా పనిచేశారు.

ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
"హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ముంబైలోని పోస్ట్ మాస్టర్ జనరల్ స్వాతి పాండే నుంచి త్రివర్ణ పతాకాన్ని అందుకోవడం గౌరవంగా ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తెలిపారు. మన పోస్టల్ వ్యవస్థలో జెండాను ఉన్నతంగా నిలిపినందుకు స్వాతికి ధన్యవాదాలు తెలిపారు. స్వాతి పాండే హర్ ఘర్ తిరంగా ప్రచారంలో రతన్ టాటాకు కూడా త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఇది కాకుండా.. ఆమె సినీ నటుడు అనుపమ్ ఖేర్కు త్రివర్ణ పతకాన్ని ఇచ్చారు. తపాలా శాఖ ఈ ప్రచారంలో 10 రోజుల్లో కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించింది. పోస్టల్ డిపార్ట్ మెంట్ ఆన్లైన్లో కూడా జెండాలను విక్రయిస్తోంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట త్రివర్ణ పతాక ప్రచారం కొనసాగుతోంది. తపాలా శాఖ 20 అంగుళాల వెడల్పు, 30 అంగుళాల పొడవున్న త్రివర్ణ పతాకాన్ని కేవలం రూ.25కే అందజేస్తోంది. ఆగస్టు 1 నుంచి పోస్టాఫీసుల ద్వారా జెండాల విక్రయం ప్రారంభమైంది. ఒకరు తమ ఇంటి నుంచే ఈ-పోస్టాఫీసు సేవ ద్వారా ఒకే ధరలో గరిష్ఠంగా ఐదు జెండాలను ఆర్డర్ చేయవచ్చు. ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా పోస్ట్మ్యాన్ జెండాలను డెలివరీ చేస్తారు. దేశంలో ఇప్పటి వరకు 1.75 లక్షల మంది ఆన్లైన్లో జెండాను ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications