భారత్ అదుర్స్! 5 ఏళ్లలో బ్రిటన్ను దాటి, 2030 నాటికి జపాన్ను దాటుతుంది
భారత
ఆర్థిక
వ్యవస్థ
ఈ
దశాబ్దకాలంలో
ఎంతో
ముందుకు
వెళ్తుందని
సెంటర్
ఫర్
ఎకనమిక్స్
అండ్
బిజినెస్
రీసెర్చ్
(CEBR)
తన
వార్షిక
నివేదికలో
పేర్కొంది.
ప్రస్తుతం
ప్రపంచ
అతిపెద్ద
ఆర్థిక
వ్యవస్థల్లో
ఆరవ
స్థానంలో
ఉన్న
భారత్,
2025
నాటికి
బ్రిటన్ను
అధిగమించి
అయిదో
స్థానానికి,
2030లో
జపాన్ను
అధిగమించి
మూడో
స్థానానికి
చేరుకోవచ్చునని
తెలిపింది.
2027
నాటికి
జర్మనీని
అధిగమిస్తుందని
పేర్కొంది.
కరోనా
కారణంగా
భారత్
ఆర్థిక
వ్యవస్థ
గాడి
తప్పిందని,
అందుకే
తన
స్థానాన్ని
బ్రిటన్కు
కోల్పోయిందని,
2024
నాటికి
అదే
స్థానంలో
ఉండి,
2025
నాటికి
ఆ
దేశాన్ని
భారత్
అధిగమించగలదని
తెలిపింది.
25 ఏళ్లలో సంపద సృష్టిలో రిలయన్స్ టాప్, ఫాస్టెస్ట్ సంస్థ ఇన్ఫోసిస్
అందుకే బ్రిటన్కు చేజారింది..
బలహీన రూపాయి కారణంగా బ్రిటన్ ఈ ఏడాది తిరిగి తన స్థానాన్ని భారత్ నుండి తీసుకోగలిగిందని CEBR నివేదిక తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ 2021లో 9 శాతం, 2022లో 7 శాతం మేర నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందినప్పుడు సాధారణంగా వృద్ధి మందగిస్తుందని, 20.35లో భారత వార్షిక వృద్ధి రేటు 5.8 శాతానికి తగ్గవచ్చునని తెలిపింది.
ఇది కాస్త ఊరట
కరోనా భారత్లో మానవ, ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, అమెరికా, ఐరోపాతో పోలిస్తే మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది కాస్త ఊరటను ఇచ్చే అంశమని వెల్లడించింది. లాక్ డౌన్ను క్రమంగా ఎత్తివేశాక ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు తిరిగి పుంచుకున్నాయని, ఉత్పత్తి మాత్రం కరోనా కంటే ముందుస్థాయితో పోలిస్తే తక్కువగా ఉందని తెలిపింది. వ్యవసాయ రంగం ముందుకు నడిపిస్తోందని వెల్లడించింది. దేశంలో వ్యాక్సీన్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం 5.5 కోట్ల మందికి టీకాలు ఇస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందని తెలిపింది.
అమెరికాను దాటనున్న చైనా
2028లో అమెరికాను వెనక్కి నెట్టి చైనా ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గతంలోని అంచనాతో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే ఇది జరుగుతోందని వెల్లడించింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకునే విషయంలో రెండు దేశాల మధ్య అసమానతలే ఇందుకు కారణమని వెల్లడించింది. మరో 10 సంవత్సరాలు జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుందని వెల్లడించింది.