న్యూఢిల్లీ: చైనా నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మన దేశంలో మళ్ళీ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. చైనాకు చెందిన 45 పెట్టుబడుల ప్రతిపాదనలను భారత్ క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో గ్రెట్ వాల్ మోటార్, ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ ఉన్నాయి. గత ఏడాది ప్రారంభంలో భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల అనంతరం చైనా కంపెనీలను, చైనా పెట్టుబడులపై భారత్ ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలు విధించిన తొమ్మిది నెలల అనంతరం ఇప్పుడు ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కేస్ బై కేస్ విశ్లేషించి అనుమతి
చైనా FDI ప్రతిపాదనలకు దాదాపు 9 నెలల నుండి అనుమతులను నిలిపివేసిన కేంద్రం ఇప్పుడు ఒక్కో ప్రతిపాదనకు కేస్ బై కేస్ పద్ధతిలో అంటే విడివిడిగా అనుమతులివ్వడం ప్రారంభించింది. సరిహద్దు వద్ద ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో చైనాకు చెందిన 45 పెట్టుబడి ప్రతిపాదనలకు అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో గ్రేట్ వాల్ మోటర్, SAIC మోటర్ కార్పొరేషన్ తదితర కంపెనీలు ఉన్నాయి. వాస్తవానికి గత కొన్ని వారాల నుండే ఈ అనుమతులు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు చిన్న పెట్టుబడులకే ఈ అనుమతులు పరిమితమయ్యాయని వార్తలు వస్తున్నాయి. అన్నింటిని విశ్లేషించిన అనంతరం పెద్ద ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెబుతున్నారు.

మరింత సరళతరం
అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. నీతి ఆయోగ్తో పాటు కేంద్రహోం, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులతో ఈ కమిటీ ఏర్పాటయింది. ఇది విదేశీ పెట్టుబడుల పరిశీలన బోర్డు కాదని, పొరుగు దేశాల నుండి వచ్చే FDI ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలే స్వయంగా పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకుంటాయి.

ఘర్షణ కారణంగా..
గత ఏడాది గాల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో రెండువైపులా ప్రాణనష్టం జరిగింది. మన దేశానికి చెందిన 20 మంది జవాన్లు అమరులయ్యారు. దీంతో దేశంలోకి చైనా పెట్టుబడులపై నియంత్రణ నిబంధనలను కేంద్రం కఠినం చేసింది. 200 కోట్ల డాలర్లకు పైగా సుమారు 150 పెట్టుబడి ప్రతిపాదనలు చైనా నుండి వచ్చాయి. హాంగ్కాంగ్ మీదుగా వచ్చే అమెరికా, జపాన్ పెట్టుబడుల మాదిరి చైనా కంపెనీల పెట్టుబడులకు అంతర్గత మంత్రిత్వశాఖ ఆమోదం తెలుపాలని నాడు కేంద్రం నిర్ణయించింది. జాతీయ భద్రతకు ఇబ్బందిలేని రంగాల్లో 45కు పైగా చెనా కంపెనీల పెట్టుబడులను అనుమతించాలని తాజాగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications