ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న భారత్ రానున్న ముప్పై ఏళ్లలో జపాన్ను దాటేసి ముందుకు వెళ్తుందని, మూడో స్థానానికి ఎగబాకుతుందని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాత భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. 2050 నాటికి జర్మనీ, జపాన్లను దాటి భారత్ మూడో స్థానానికి ఎగబాకుతుందని లాన్సెట్ అభిప్రాయపడింది. 2100 సంవత్సరం నాటికి కూడా మూడో స్థానంలోనే కొనసాగుతుందని లాన్సెట్ తెలిపింది.

2050 మూడో స్థానానికి భారత్
2017 నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. ఆ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకున్న లాన్సెట్ భారత ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వెల్లడించింది. 2030 సంవత్సరం నాటికి అమెరికా, చైనా, జపాన్ తర్వాత నాలుగో స్థానానికి చేరుకుంటుందని వెల్లడించింద. 2050 నాటికి జపాన్ను అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ఇప్పుడు భారత్ ఐదో స్థానంలో ఉండగా, ఆరో స్థానంలో బ్రిటన్, ఏడో స్థానంలో ఫ్రాన్స్, ఎనిమిదో స్థానంలో ఇటలీ ఉన్నాయి.

మోడీ కల ఆలస్యం
భారత్ టార్గెట్ కూడా ఈ లైన్లోనే ఉంది. 2047 నాటికి భారత్ ప్రపంచ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి అయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. అయితే గత అంచనాలతో పోలిస్తే ఇప్పుడు తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా మహమ్మారి. గత ఏడాది డిసెంబర్ మాసంలో విడుదలైన జపాన్ సెంటర్ ఫర్ ఎకనమిక్ రీసెర్చ్ ప్రకారం 2029 నాటికి జపాన్ను భారత్ దాటేసి 3వ స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇప్పుడు కరోనా వల్ల మరింత ఆలస్యం కానుంది. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత ప్రతిష్టాత్మక లక్ష్యం కూడా మహమ్మారి వల్ల ఆలస్యం కానుంది. 2025 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మోడీ కలలు కంటున్నారు.

భారత్లో ఎక్కువ వర్కింగ్ ఫోర్స్
వివిధ దేశాల్లోని శ్రామిక జనాభా వల్ల ఆయా దేశాల జీడీపీలో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకొని లాన్సెట్ అంచనా వేసింది. మున్ముందు చైనాతోపాటు భారత్లో శ్రామిక జనాభా సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, అయినప్పటికీ శ్రామికుల సంఖ్యా పరంగా భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతుందని పేర్కొంది. 2100 సంవత్సరం నాటికి కూడా శ్రామికజనులు భారత్లో ఎక్కువగా ఉంటారని, ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా, చైనా, అమెరికా నిలుస్తాయని తెలిపింది. 2100 నాటికి జపాన్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుందని తెలిపింది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications