అమెరికా నుండి ఆయిల్ దిగుమతులు 10 రెట్లు పెరిగింది
అమెరికా నుండి భారత్కు చమురు దిగుమతులు గత రెండేళ్లలో పది రెట్లు పెరిగాయి. కొన్నేళ్ల క్రితం రోజుకు 25 వేల బ్యారెల్స్గా ఉన్న చమురు, గ్యాస్ సరఫరా ఇప్పుడు 2,50,000 బ్యారెల్స్కు చేరుకుందని యూఎస్ ఎనర్జీ సెక్రటరీ డాన్ బ్రౌలెట్టే మంగళవారం వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఇంధన సంబంధాలను ఇది బలపరుస్తుంది.
భారత్ 2017-18లో 1.9 మిలియన్ టన్నుల (38,000 bpd) క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంది. 2018-19లో 6.2 మిలియన్ టన్నులు (1,24,000 bpd) దిగుమతి చేసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ ఏడాది 5.4 మమిలియన్ టన్నుల క్రూడాయిల్ అమెరికా నుండి భారత్కు దిగుమతి అయింది.
దీంతో అమెరికా-భారత్ ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. డాన్ బ్రౌలెట్టే పనితీరును ప్రశంసించారు. 2017 నుంచే అమెరికా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం భారత్కు చమురు సరఫరాదారుల్లో అమెరికా ఆరవ స్థానంలో ఉందని భారత చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గత ఏడాది ద్వైపాక్షిక హైడ్రోకార్బన్ వాణిజ్యం 7.7 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుందని తెలిపారు.
గుడ్న్యూస్!: 29 వరకు FASTagలు ఉచితం, ఎలా తీసుకోవలంటే?