భారత్ 'ప్రతీకార' దెబ్బ: మనమే నష్టపోతున్నాం, GSP హోదాపై దిగివస్తున్న అమెరికా
ఇండియాకు గతంలో రద్దు చేసిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP)ను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు భారత్తో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. GSPకి ప్రతిగా ఇండియా నుండి సరైన ప్రతిపాదనలు వస్తే పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడతాయని తెలిపింది. భారత్ అధిక టారిఫ్ విధిస్తోందనే వివిధ కారణాలతో అమెరికా గతంలో GSP హోదాను తొలగించింది. ఇప్పుడు చైనాతో వాణిజ్య అమెరికాకు వాణిజ్య యుద్ధం ముదరడం, భారత్ అవసరం నేపథ్యంలో అమెరికా దీనిని పరిశీలిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
సరిహద్దులో ఉద్రిక్తత: చైనా నుండి ఇండియా కంపెనీల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు
యాపిల్ సహా భారత్ సుంకాలు పెంచింది... అందుకే
యాపిల్ పండ్ల పైన భారత్ 70 శాతం సుంకాలు విధిస్తోందని వాషింగ్టన్కు చెందిన ఓ ప్రతినిధి చట్టసభలో మాట్లాడుతూ ఆరోపించారు. దీని నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలని అడిగారు. దీనికి మరో ప్రతినిధి స్పందిస్తూ పప్పు దినుసులపై కూడా భారత్ సుంకాలు పెంచిందని, దీంతో అమెరికా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటికి భారత్కు జీఎస్పీ రద్దు చేయడం వల్ల కలుగుతున్న నష్టమని అభిప్రాయపడ్డారు.
నష్టపోతున్నాం.. అందుకే జీఎస్పీని పునరుద్ధరించే ప్రయత్నం
దీనిపై వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటైజర్ స్పందిస్తూ.. జీఎస్పీ పునరుద్ధరణ దిశగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జీఎస్పీ రద్దుకు ప్రతిగా భారత్ అధిక సుంకాలు విధించిందని, దీంతో మన రైతులకు నష్టం జరుగుతోందని, ఇప్పుడు దీనిని తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగాను అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
భారత్ ప్రతీకారం.. దెబ్బతీసింది
జీఎస్పీ హోదాను రద్దు చేసినందుకు భారత్ ప్రతీకారంగా ట్యాక్స్ పెంచిందని, ఇవి భారంగా మారాయని అభిప్రాయపడ్డారు. పప్పు దినుసుల విషయంలోనూ చాలా ఘోరమైన టారిఫ్ విధిస్తోందన్నారు. పలువురు ప్రతినిధులు సుంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు.