నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్ మార్కెట్ను మరింత విస్తరించడంతో పాటు ఇందులోకి రిటైల్ భాగస్వామ్యాన్ని తీసుకు వచ్చేందుకు తొలిసారి బాండ్ ETF ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. బుధవారం (డిసెంబర్ 4) కేంద్ర ప్రభుత్వం భారత్ బాండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్కు పచ్చ జెండా ఊపింది. దీనిని ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది. ప్రభుత్వం, స్టేక్ హోల్డర్స్తో రెండేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం దీనిని తీసుకు వచ్చారు.
ఇది తొలి కార్పోరేట్ బాండ్ ETF అని, ఇది ప్రభుత్వరంగ బ్యాంకుల (PSU)తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధులను సమకూరుస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

భారత్ బాండ్ ETF మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ కలిగి ఉంటాయి. యూనిట్స్ స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ అవుతాయి. ETF AAA- రేటెడ్ సంస్థలను కలిగి ఉంటుంది. భారత్ బాండ్ ETF యూనిట్ వ్యాల్యూ రూ.1,000గా ఉంటుంది.
ఈ పథకం ద్వారా రెండు ఎంపిక చేసుకోవచ్చు. ఒకటి మూడేళ్లు (2023), రెండోది పదేళ్లు (2030). గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. డివిడెండ్ ఆప్షన్ లేదు. ఈ బాండ్స్ను డిసెంబర్లో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications