2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.10.75 లక్షల కోట్లుగా నమోదయింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 135 శాతానికి సమానం. అంటే బడ్జెట్ అంచనాల కంటే 35 శాతం ఎక్కువ. కరోనా వైరస్ నేపథ్యంలో రెవెన్యూ వసూళ్లు పడిపోయిన విషయం తెలిసిందే. ఇది ద్రవ్య లోటు పైన ప్రభావం చూపింది. 2019 నవంబర్ ముగిసే సమయానికి ద్రవ్యలోటు 2019-20 బడ్జెట్ అంచనాల్లో 114.8 శాతంగా నమోదయింది.

ప్రభుత్వం ఖర్చు
ప్రభుత్వ వ్యయంలో కొంత పెరుగుదల ఉంది. FY21లో ద్రవ్యలోటు జీడీపీలో 7.5 శాతం నుండి 9 శాతం మధ్య ఉండవచ్చునని ఆర్థిక నిపుణలు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా రికవరీ కావాలంటే ప్రభుత్వం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నవంబర్ నాటికి ప్రభుత్వ ఖర్చులు 4.7 శాతం పెరిగి 19.06 లక్షల కోట్లుగా నమోదయింది.
నవంబర్లో ఖర్చు తర్వాత కూడా 2019-20 ఆర్థిక సంవత్సరం 65.3 శాతంతో పోలిస్తే ఇది బడ్జెట్లో 62.7 శాతం. FY20లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంచనాలు 63.3 శాతం కాగా 58.5 శాతంగా ఉంది. గత నవంబర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.7 శాతంగా నమోదయింది.

లోటు తగ్గవచ్చు
FY21లో ప్రభుత్వ మొత్తం ఖర్చులు రూ.30.2 లక్షల కోట్లుగా ఉండవచ్చునని ఇక్రా అంచనా వేసింది. ఇది బడ్జెట్ అంచనాల కంటే తక్కువ. ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ తక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రకటించిన పలు కేటాయింపులు అమలు చేయకపోవచ్చు. అప్పుడు లోటును రూ.1 లక్ష కోట్ల నుండి రూ.2 లక్షల కోట్లకు తగ్గించే అవకాశాలు ఉంటాయి.

కరెంట్ ఖాతా లోటు
కాగా 2020-21 రెండో త్రైమాసికం జూలై-సెప్టెంబర్ నాటికి దేశీయ కరెంట్ ఖాతా మిగులు 15.5 బిలియన్ డాలర్ల (రూ.1,13,439 కోట్ల)కు తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఇది 2.4 శాతానికి సమానం. తొలి త్రైమాసికంలో 10.8 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు రెండో త్రైమాసికంలో 14.8 బిలియన్ డాలర్ల(రూ.1,08,231 కోట్ల)కు పెరిగినందున కరెంట్ ఖాతా మిగులు తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications