న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా.. చిక్కుల్లో చిక్కుకుంది. న్యాయపరమైన వివాదాల్లో నిండా మునిగింది. బ్రిటన్కు చెందిన పారిశ్రామిక దిగ్గజ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. ఎయిరిండియాపై పిటీషన్ వేసింది. 1.2 బిలియన్ డాలర్లకు చెందిన పిటీషన్ అది. అమెరికా న్యాయస్థానంలో ఈ మేరకు ఈ కేసును దాఖలు చేసింది. గత ఏడాది డిసెంబర్లో ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఎయిరిండియా ధిక్కరించినట్లు పేర్కొంది. బ్రిటన్ అనుసరిస్తోన్న పెట్టుబడుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఉల్లంఘించిందని స్పష్టం చేసింది.
అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం సదరన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ను కెయిర్న్ ఎనర్జీ యాజమాన్యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పిటీషన్లను దాఖలు చేసింది. ఈ వివాదంలో కెయిర్న్ ఎనర్జీ వాదనలు నెగ్గితే.. ఎయిరిండియా నెత్తిన పిడుగు పడినట్టే. ఇప్పటికే నష్టాలను చవి చూస్తూ, ప్రైవేటీకరణను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా 1.2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొనడం మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టవుతుంది. ఎయిరిండియా తరఫున కేంద్ర ప్రభుత్వం.. 1.2 బిలియన్ డాలర్లు ప్లస్ వడ్డీతో సహా ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు లోబడి మరింత మొత్తాన్ని జమ కట్టాల్సి ఉంటుంది.

కెయిర్న్ ఎనర్జీ దాఖలు చేసిన ఈ పిటీషన్పై ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. దీనిపై మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉందని తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు కూడా మౌనం దాల్చారు. ఎయిరిండియాపై కెయిర్న్ ఎనర్జీ ఆర్థికపరమైన పిటీషన్ను న్యాయస్థానాల్లో దాఖలు చేయడం ఇది రెండోసారి. మధ్యవర్తిత్వాన్ని తమకు అప్పగించాలంటూ ఇదివరకు ఫిబ్రవరిలో ఓ కేసును దాఖలు చేసింది. మధ్యవర్తిత్వానికి సంబంధించి 2014 నుంచి ఉన్న ఇంటరెస్ట్ను చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందా సంస్థ. తాజాగా మరోసారి కోర్టుకెక్కింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications