ఇండియా ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దశలో ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. అలాగే, ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో నిర్వహించిన ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో మాట్లాడారు.

ఆ కారణం వల్లే
భారత్ ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దిశగా ఎదగడానికి కారణం మొబైల్ నెట్ వర్క్ విపరీతంగా పెరగడంతో పాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరించడం వల్లేనని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా వల్ల ఇది సాధ్యమవుతోందన్నారు. అప్పటి నుండే ఇది ప్రారంభమైందన్నారు.

జియో వేగం ఎంతంటే..
380 మిలియన్ల మంది ప్రజలు రిలయన్స్ జియో 4G టెక్నాలజీ వైపు మరలినట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రీ జియో డేటా స్పీడ్ 256Kbps కాగా, పోస్ట్ జియో వేగం 21Mbpsగా ఉందని తెలిపారు.

ట్రంప్ పర్యటన.. భిన్నమైన భారత్
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై కూడా ముఖేష్ అంబాని స్పందించారు. గతంలో నాటి అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు చూసిన భారతదేశం కంటే ఇప్పుడు ట్రంప్ చూసే భారత్ భిన్నంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అతి కీలకమైన మార్పులో మొబైల్ కనెక్టివిటీ అన్నారు.

తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్..
ప్రపంచంలోని తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుందని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదని ముఖేష్ అంబానీ అన్నారు. అయితే ఇది ఐదేళ్లలో సాధ్యమా లేక పదేళ్లలో సాధ్యమా అన్నదే ఇప్పుడు చర్చ అన్నారు. ప్రస్తుతం టాప్ 2లో అమెరికా, చైనా ఉన్నాయి. ఆ తర్వాత స్థాయికి భారత్ ఎదుగుతుందని ముఖేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మీరు, నేను చూసిన దానికంటే విభిన్న భారత్
భారత్ ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మారేందుకు మంచి అవకాశముందని ముఖేష్ అంబానీ చెప్పారు. మీరు (సత్య నాదెళ్ల) చూసిన దాని కంటే, అలాగే నేను పెరిగిన వాతావరణం కంటే విభిన్నమైన భారతాన్ని వచ్చే తరం చూడబోతుందని ముఖేష్ అంబానీ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications