దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం పీఎం-కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేసింది. దీనికి పారిశ్రామికవేత్తలు, ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, విప్రో ఇలా ఎన్నో సంస్థలు వందల కోట్లు అందించాయి. ఈ జాబితాలో చైనీస్ కంపెనీలు కూడా ఉన్నాయి. టిక్టాక్ వంటి సంస్థలు రూ.30 కోట్లు ఇచ్చాయి. చైనీస్ టెలికం దిగ్గజం హువావే కూడా భారీ విరాళం ఇచ్చింది.

పీఎం కేర్స్, ఆరు రాష్ట్రాలకు రూ.7 కోట్లు
చైనాకు చెందిన హువావే... పీఎం కేర్స్ ఫండ్, మరో ఆరు రాష్ట్రాలకు కరోనాపై పోరు కోసం రూ.7 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనాపై పోరుకు రిమోట్ టెంపరేచర్ మానిటరింగ్ వంటి సాంకేతిక పరిష్కారాలను భారత్తో పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హువావే ఇండియా సీఈవో జే చెన్ మాట్లాడుతూ.. కరోనాపై పోరుకు చైనా అనుభవాలను, సాంకేతికతను భారత్ దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సహకరిస్తామని తెలిపారు.

ప్రభుత్వానికి సహకరిస్తాం
చైనాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కదిలే ఆబ్జెక్టివ్ ఉష్ణోగ్రతను రియల్ టైంలో 5జీ ప్లస్ థెర్మల్ ఇమేజింగ్ ద్వారా గుర్తించవచ్చునని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనాలో ఈ టెక్నాలజీని ఉపయోగించారన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి హువావే ఇండియా కూడా తమ సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు పరిశ్రమ తదితరులతో కలిసి పని చేస్తున్నామన్నారు.

వందల కోట్లు..
పీఎం కేర్స్ ఫండ్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లు ఇచ్చింది. భారతీ ఎంటర్ ప్రైజెస్ రూ.100 కోట్లు ప్రకటించింది. సన్ ఫార్మా కూడా రూ.100 కోట్లు ఇచ్చింది. కరోనాపై పోరుకు టాటా గ్రూప్ రూ.1500 కోట్లు, విప్రో రూ.1200 కోట్లు ప్రకటించింది. ఇందులో పీఎం కేర్స్ ఫండ్తో పాటు వివిధ రూపాల్లో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications