48 శాతం డౌన్: హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు: అనరాక్ రిపోర్ట్
దేశంలో ఏడు టాప్ సిటీలలో ఇళ్ల అమ్మకాలు 47 శాతం తగ్గుతాయని ప్రొపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అంచనా వేసింది. అమ్మకాలు 1.38 లక్షలకు పరిమితం అవుతాయని చెబుతోంది. కరోనా వైరస్ వల్ల డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్త హౌసింగ్ సప్లయ్ 46 శాతం తగ్గి 1.28 లక్షల యూనిట్లకుగా నమోదవుతుందని అంచనా వేస్తోంది.
47 శాతం పడిపోయిన అమ్మకాలు
ఢిల్లీ, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతాలో హౌసింగ్ సేల్స్పై కంపెనీ రిపోర్డు విడుదల చేసింది. 2019లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడవగా, కొత్త ఇళ్ల సప్లయ్ 2.37 లక్షలుగా రికార్డయినట్లు అనరాక్ పేర్కొంది. 2020లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో మంచి రికవరీ కనబడుతోందని తెలిపింది. కరోనా వల్ల 2020లో రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. చివరి రెండు క్వార్టర్లలో రెసిడెన్షియల్ డిమాండ్ కొంత ఊపందుకుందని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పురి చెప్పారు.
ఎందుకు పడిపోయాయంటే..
హౌసింగ్ లోన్స్పై తక్కువ వడ్డీ రేటు, స్టాంప్ డ్యూటీ కోత వంటివీ డిమాండ్ పెరగడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో గరిష్టంగా 44,320, బెంగళూరులో 24,910 ఇళ్లు అమ్ముడవుతాయని డేటా చెబుతోంది. 2019లో ముంబైలో 80,870 ఇళ్లు సేల్ అయ్యాయి. 2020లో సేల్స్ 45 శాతం తక్కువగా విక్రయాలు జరిగాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు అంతకు ముందు ఏడాదిలో 50,450 నుంచి 51 శాతం తగ్గుతాయని అనరాక్ పేర్కొంది. పుణెలో అమ్మకాలు 42 శాతం, ఢిల్లీలో 51 శాతం సేల్స్ పడనున్నాయని తెలిపింది. హైదరాబాద్లో 2019లో 16,590 ఇళ్లు అమ్ముడయ్యాయి. దీంతో పోలిస్తే 2020లో సేల్స్ 48 శాతం తగ్గి 8,560కి పరిమితమవుతున్నాయని రిపోర్టు వెల్లడించింది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 6,740 యూనిట్లకు తగ్గుతాయని పేర్కొంది.
అక్కడ 49 శాతం
కోల్కతాలో సేల్స్ తగ్గుదల 49 శాతమని వెల్లడించింది. అమ్ముడుకాని హౌసింగ్ స్టాక్ ఈ ఏడాది 2 శాతం తగ్గి 6,38,020 యూనిట్లకు చేరుతుందని, అంతకు ముందు ఏడాదిలో ఇది 6,48,400 యూనిట్లని అనరాక్ రిపోర్టు తెలిపింది. కొందరు ప్రొపర్టీ కన్సల్టెంట్లు, డేటా ఎనలిటిక్స్ ఫర్మ్స్ క్వార్టర్లీ ప్రాతిపదికన హౌసింగ్ మార్కెట్ డేటాను రూపొందిస్తున్నాయి.