HCL Technologies: ప్రస్తుతం దేశంలోని ఐటీ కంపెనీలు లాభాల మార్జిన్ల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రెండు రోజుల క్రితం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లాభాలు అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం హెచ్సీఎల్ కంపెనీ సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పుడు కంపెనీలకు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఉద్యోగుల వలసలు. పైగా ఉద్యోగుల వేతనాల ఖర్చులు సైతం ఐటీ కంపెనీలకు తడిసి మోపెడవుతోందని సంస్థలు చెబుతున్నాయి.

రానున్న మూడు నెలల్లో కొలువులు..
ఈ క్రమంలో HCL టెక్నాలజీస్ జూలై-సెప్టెంబర్ క్వార్టర్ లో కొత్తగా 10,400 మంది ఫ్రెషర్లను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల వలసల సమస్యను టీసీఎస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం భారీగానే ఎదుర్కొంటున్నాయి.
రాబోయే నెలల్లో మార్జిన్లను మెరుగుపరచడానికి కంపెనీ వినూత్న ధరలను, రేటు పెంపుదల, నిర్వహణ వ్యయాల ఆప్టిమైజేషన్ను అమలు చేస్తుందని హెచ్సrఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి. విజయకుమార్ చెప్పారు. దీని వల్ల పెరిగిన టాలెంట్ ఖర్చులు, పరివర్తన ఖర్చుల కారణంగా సేవల వ్యాపారంలో మార్జిన్లు ఒత్తిడి తగ్గించటానికి ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన వెల్లడించారు.

ఉద్యోగుల సంఖ్య ఇలా..
జూన్ 30 నాటికి HCL టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 210,966 మందిగా ఉంది. IT మేజర్ 2022 ఏప్రిల్- జూన్ మధ్య 2,089 మంది సిబ్బందిని కొత్తగా నియమించుకుంది. ఇవి కాకుండా.. FY23లో 30,000-35,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ 2022 మధ్యకాలంలో 10,400 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోందని కంపెనీ ప్రతినిధి అప్పారావు వెల్లడించారు.

జీతాల పెంపుపై..
జీతాల పెంపు గురించి వెల్లడిస్తూ.. జూలై 1 నుంచి పెంపుదల అమలులోకి వచ్చినందున రాబోయే వారాల్లో వివరాలను తెలియజేస్తామని కంపెనీ తెలిపింది. మునుపటి సంవత్సరంలో 44,000 మంది ఉద్యోగులకు నైపుణ్యం కల్పించినందున HCL దాదాపు రెండు మిలియన్ గంటల అప్ స్కిల్ శిక్షణను నిర్వహించినట్లు వెల్లడించింది. త్వరలోనే వేల సంఖ్యలో అందుబాటులోకి రానున్న మరిన్ని కొలువలు గురించి సమాచారం తెలుసుకునేందుకు కంపెనీ వెబ్ సైట్ లో తెలుసుకోండి.

కంపెనీ లాభాలు ఇలా..
మెుదటి క్వార్టర్ లో కంపెనీ రూ.3,283 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత సంవత్సరం ఇదే క్వార్టర్ కాలానికి సంబంధించిన లాభంతో పోల్చితే 2.4 శాతం ఎక్కువని కంపెనీ తెలిపింది. మార్చి క్వార్టర్ లో కంపెనీ లాభాలు రూ.3,593 కోట్లుగా ఉన్నాయి. అంటే ఈ త్రైమాసికంగా 8 శాతానికి పైగా లాభాల్లో క్షీణత నమోదైంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications