Free LPG Cylinders: దేశంలో నిత్యావసరాలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధర విపరీతంగా పెరిగింది. పైగా సబ్సిడీనీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటంతో అనేక మంది మధ్య తరగతి ప్రజలు సైతం ధరల భారాన్ని మోయక తప్పటం లేదు. చాలా మంది తమ నెలవారీ సంపాదనలో ఎక్కువ శాతం పెట్రోల్, గ్యాస్, ఆహార పదార్ధాలకే వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు.

ఉచిత సిలిండర్స్..
ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి ఏడాదిలో 2 సిలిండర్లను ఉచితంగా అందించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రకటిస్తూ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తమకు ఏడాదికి రూ.2,000 వరకు ఆదా అవుతుందని చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి మాట..
ప్రభుత్వ నిర్ణయంపై గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వకానీ స్పందించారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల కుటుంబాలకు భారం తగ్గించటానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గుజరాత్ ప్రభుత్వంపై రూ.650 కోట్ల అదనపు భారం పడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారుల కుటుంబాలకు రూ.1,700 నగదు చేతికి అందజేయనున్నట్లు వెల్లడైంది.

వ్యాట్ తగ్గింపు..
ఈ ప్రకటనకు ముందు గుజరాత్ ప్రభుత్వం CNG, PNGపై 10 శాతం వ్యాట్ పన్నును తగ్గించింది. తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రకటన చేసింది. అధికారంలో ఉన్న బీజేపీవి చిత్తశుద్ధి లేని చర్యలని అనేక మంది ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఈ రూపంలో తాయిలాలను ఇచ్చి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోందని అంటున్నారు.

అమిత్ షా..
అవసరం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చే బీజేపీకి ఇది పెద్ద పరీక్షా కాలంగా కనిపిస్తోంది. ఎన్నికలకు షెడ్యూల్ రావటానికి ముందుగా.. ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే అధికారికంగా తాయిలాల ప్రకటన పెద్ద దుమారంగా మారింది. ప్రతి పక్షాలు ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని.. ఎలక్షన్స్ తర్వాత దీనిని నిలిపివేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా ఈ నిర్ణయం ప్రజలకు కొంత కాలం ఊరటను ఇవ్వనుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications