వారికి రూ.40,000 కోట్ల రీఫండ్ను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) దాదాపు 2,500 మంది ఎగుమతిదారులకు రూ.40,000 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (IGST)రీఫండ్ను బ్లాక్ చేసింది. ఎగుమతిదారులు నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ను క్లెయిమ్ చేసుకుంటుండవచ్చునని డిపార్టుమెంట్ డేటా అథంటికేషన్ డ్రైవ్ సూచించింది. దీంతో దీనిని బ్లాక్ చేసింది.
ఆ ఎగుమతిదారులకు సంబంధించిన క్లెయిమ్స్ను వెరిఫై చేయాలని కూడా ఫీల్డ్ ఆఫీసర్లను CBIC ఆదేశించింది. నిజాయితీపరులైన ఎగుమతిదారులు ఇబ్బందిపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయంలోపు వెరిఫై చేయాలని సూచించింది.
Big News: రాకేష్ ఝున్ఝున్వాలాకు సెబి షాక్.. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై నోటీసులు
బ్లాక్ చేసిన అందరు ఎగుమతిదారులకు కూడా వెరిఫికేషన్ అంశంపై సమాచారం ఇవ్వాలని, నిర్ణీత సమయంలోపు దీనిని పూర్తి చేయాలని CBIC జీఎస్టీ పాలసీ విభాగం జనవరి 23వ తేదీన విడుదల చేసిన సర్క్యులర్లో.. కమిషనర్స్కు సూచించింది. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ పైన నకిలీ ఇన్వాయిస్ల ద్వారా రీఫండ్ పొందిన సందర్భాలు ఇటీవల వెలుగు చూశాయని పేర్కొంది.
ఇలాంటి చర్యలను తగ్గించేందుకు CBIC మరిన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపింది. వెరిఫికేషన్ కోసం ఎంచుకున్న ఎగుమతుదారుల సంఖ్య చాలా తక్కువేనని పేర్కొంది. రూ.40,000 కోట్లకు సంబంధించిన ఇన్వాయిస్లు మ్యాచ్ కాకపోవడంతో నిలిపివేసింది. వెరిఫికేషన్ అనంతరం చర్యలు తీసుకుంటుంది.