కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ప్లిప్కార్ట్ సంస్థలు సంక్లిష్ట వ్యవస్థలను సృష్టిస్తున్నాయని దేశంలోని రిటైల్ వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించి FDI నిబంధనలు సవరించేందుకు మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్రధానంగా పండుగ వంటి సమయంలో, ఇతర సమయాల్లో ఆఫర్ల పేరుతో కస్టమర్లను అతి తక్కువ ధరకు ఇస్తున్నాయి. దీంతో రిటైలర్లు దెబ్బతింటున్నారు. వర్తకుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం మార్పులకు సిద్ధమైందని తెలుస్తోంది.

మరిన్ని సవరణలు
కొనుగోలుదారులను, అమ్మకందారులను మార్కెట్కు అనుసంధానించి వ్యాపారాన్ని నిర్వహించేందుకు మాత్రమే విదేశీ ఈ-కామర్స్ సంస్థలను భారత్ అనుమతిస్తోంది. కానీ ఈ-కామర్స్ సంస్థలు నేరుగా తమ ప్లాట్ ఫామ్ ద్వారా వస్తువులు విక్రయించేందుకు వెసులుబాటులేదు. మూడేళ్ల క్రితమే 2018 డిసెంబర్లో చిన్న వ్యాపారులకు అనుకూలంగా, ఈ కామర్స్ సంస్థలకు షాకిచ్చేలా మోడీ ప్రభుత్వం FDI నిబంధనలను సవరించింది. అమ్మకందారులతో కలిసి వారి ఉత్పత్తులపై ఆఫర్లు ఇవ్వడాన్ని నిషేధించింది. ఇది తమ సంస్థలపై వివక్ష అని అమెరికా అప్పుడు గగ్గోలు పెట్టింది. అయినప్పటికీ నిబంధనలు పక్కదారి పట్టిస్తూ విక్రయాలు జరుపుతున్నాయి ఈ-కామర్స్ సంస్థలు. ఈ నేపథ్యంలో FDIకి సంబంధించి మరిన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఇలా పక్కదారి
పండుగలు, ప్రత్యేక సేల్స్ పేరుతో ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నారు. పెద్ద సంస్థలతో పోటీ పడలేకపోతున్నారు. లాభాలు లేకపోయినా మార్కెట్పై గుత్తాధిపత్యం ప్రదర్శించే దిశగా సాగుతున్నాయి ఈ కామర్స్ సంస్థలు. ఈ-కామర్స్ దిగ్గజాలు తమ మాతృసంస్థ లేదా అనుబంధ సంస్థల ద్వారా అమ్మకందారుల కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ నిబంధనలను పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో అలాంటి అవకాశం లేకుండా FDI నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తోందని తెలుస్తోంది.

గట్టి షాక్
దేశీయ ఆన్లైన్ అమ్మకాలలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ముందంజలో ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్న రెండు పెద్ద కంపెనీల్లో అమెజాన్కు పరోక్ష వాటా ఉంది. కేంద్రం మరోసారి మార్పులు చేస్తే ఇలాంటి ఈ-కామర్స్ దిగ్గజాలకు గట్టి షాక్ తగులుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ-కామర్స్ సంస్థల్లో 100 శాతం FDIలకు అనుమతి ఉంది. కానీ ఇన్వెంటరీ ఆధారిత యాక్టివిటీస్కు అనుమతి లేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications