న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఆర్థిక మందగమనం వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వానికి జీఎస్టీ కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి సారించింది. భారత్ జీడీపీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వరుసగా తొలి, రెండో క్వార్టర్లలో 5 శాతానికి, 4.5 శాతానికి పడిపోయింది.

రూ.2.5 లక్షల కోట్లు క్షీణించింది
భారత్కు ఓవైపు ప్రయివేటురంగ పెట్టుబడుల కొరత, మరోవైపు మందగమనం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఖర్చుల్ని తగ్గించుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు రెవెన్యూ దాదాపు రూ.2.5 లక్షల కోట్లు క్షీణించిందని, దీంతో ఈసారి కేంద్రం నిర్దేశిత ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.2 లక్షల కోట్లను తగ్గించుకోవాలని..
2019-20 ఆర్థిక సంవత్సరం వ్యయలక్ష్యం రూ.27.86 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సుమారు 65 శాతం నవంబర్ నాటికే దాటింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వ ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. వ్యయ లక్ష్యంలో కనీసం రూ.2 లక్షల కోట్లను అయినా తగ్గించుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో ప్రభుత్వ వ్యయం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.

అదే జరిగితే జీడీపీ మరింత తగ్గుతుంది
ఖర్చును తగ్గించుకుంటేనే జీడీపీలో ద్రవ్యలోటును కట్టడి చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికే అదుపు చేయాలని యోచిస్తోంది. ఇంతకుముందు ఈ టార్గెట్ 3.3 శాతంగా ఉంది. ప్రస్తుత మందగమనం నేపథ్యంలో దీనిని 3.8 శాతానికి పెంచారు. డిమాండ్ కొరత, మార్కెట్లో స్తబ్ధత, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన మేర లేవని, దీంతో పన్ను వసూళ్లు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రయివేటు రంగ పెట్టుబడులు మరింత తగ్గితే జీడీపీ ఇంకా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications