న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఆర్థిక మందగమనం వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వానికి జీఎస్టీ కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి సారించింది. భారత్ జీడీపీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వరుసగా తొలి, రెండో క్వార్టర్లలో 5 శాతానికి, 4.5 శాతానికి పడిపోయింది.

రూ.2.5 లక్షల కోట్లు క్షీణించింది
భారత్కు ఓవైపు ప్రయివేటురంగ పెట్టుబడుల కొరత, మరోవైపు మందగమనం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఖర్చుల్ని తగ్గించుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు రెవెన్యూ దాదాపు రూ.2.5 లక్షల కోట్లు క్షీణించిందని, దీంతో ఈసారి కేంద్రం నిర్దేశిత ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.2 లక్షల కోట్లను తగ్గించుకోవాలని..
2019-20 ఆర్థిక సంవత్సరం వ్యయలక్ష్యం రూ.27.86 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సుమారు 65 శాతం నవంబర్ నాటికే దాటింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వ ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. వ్యయ లక్ష్యంలో కనీసం రూ.2 లక్షల కోట్లను అయినా తగ్గించుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో ప్రభుత్వ వ్యయం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.

అదే జరిగితే జీడీపీ మరింత తగ్గుతుంది
ఖర్చును తగ్గించుకుంటేనే జీడీపీలో ద్రవ్యలోటును కట్టడి చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికే అదుపు చేయాలని యోచిస్తోంది. ఇంతకుముందు ఈ టార్గెట్ 3.3 శాతంగా ఉంది. ప్రస్తుత మందగమనం నేపథ్యంలో దీనిని 3.8 శాతానికి పెంచారు. డిమాండ్ కొరత, మార్కెట్లో స్తబ్ధత, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆశించిన మేర లేవని, దీంతో పన్ను వసూళ్లు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రయివేటు రంగ పెట్టుబడులు మరింత తగ్గితే జీడీపీ ఇంకా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications