రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈరోజు (జూలై 15, బుధవారం) మధ్యాహ్నం 2గంటలకు వర్చువల్ సమావేశం ప్రారంభించారు. ఇది రిలయన్స్ 43వ వార్షిక సాధారణ సమావేశం(AGM). ముఖేష్ అంబానీ తొలుత కంపెనీ బోర్డు కొత్త సభ్యులను పరిచయం చేశారు. అనంతరం షేర్హోల్డర్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం కరోనా మహమ్మారి కారణంగా చూస్తున్నామన్నారు. ఇటీవలే విడుదలైన జియోమీట్కు 5 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. 150 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను చేరుకున్న తొలి బారత కంపెనీ రిలయన్స్ అన్నారు. జియో డిజిటల్ గేట్ వే ఆఫ్ ఇండియా అన్నారు.

ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 9.1 శాతం
డిజిటల్ అనుసంధాన వేదికగా జియో మీట్ను తీసుకు వచ్చామని ముఖేష్ అంబానీ చెప్పారు. దేశ ఎగుమతుల్లో 9.1 శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ది అని చెప్పారు. 109 దేశాలకు రిలయన్స్ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నామని వెల్లడించారు. భారత్లోనే అతిపెద్ద వాణిజ్య ఎగుమతిదారుగా రిలయన్స్ ఆవిర్భవించిందన్నారు. జియో ప్లాట్ఫాంను రుణరహిత సంస్థగా మార్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపారు. ఆధునిక మానవ చరిత్రలో కరోనా అతిపెద్ద సంక్షోభం సృష్టించిందన్నారు. కరోనా అనంతర అవకాశాలను అందుకునే దిశగా రిలయన్స్ ప్రయత్నం చేస్తోందన్నారు.

గూగుల్ రూ.33,737 పెట్టుబడి
రిలయన్స్ డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్ఫాంలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ రూ.33,737 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ పెట్టుబడితో 7.7 శాతం వాటాను దక్కించుకుంటుందన్నారు. రిలయన్స్ జియోకు గూగుల్ వ్యూహాత్మక భాగస్వామి అన్నారు. డిజిటల్ విప్లవాన్ని జియో ముందుకు తీసుకు వెళ్తోందన్నారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచం సరికొత్త సాంకేతిక విప్లవం చూడనుందన్నారు.

జియో రుణరహితం...
రిలయన్స్ జియోలోకి రూ.2.12 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సమీకరణ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు తెలిపారు. జియోను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జియో, రిటైల్ ఆయిల్ విభాగాల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. జియోకు దాదాపు హాఫ్ బిలియన్ మొబైల్ కస్టమర్లు ఉన్నట్లు తెలిపారు. మెరుగైన ప్రపంచం దిశగా ప్రయాణానికి భారత్ మార్గదర్శిగా ఉంటుందన్నారు. టెలికం రంగంలో ప్రపంచంలోనే నెంబర్ 2గా జియో నిలిచిందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications