ఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం మంగళవారం భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బీజేపీ ఎంపీ చేసిన జీడీపీ వ్యాఖ్యలకు కౌంటర్గా ఇండియన్ ఎకానమీని కేవలం దేవుడు మాత్రమే కాపాడాలని పేర్కొన్నారు. సదరు ఎంపీపై మండిపడ్డారు. ఇటీవల ఇండియన్ జీడీపీ వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, రియల్ వంటి వివిధ రంగాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి.
ఇలాంటి సందర్భంలో లోకసభలో వివిధ బిల్లులు ప్రవేశ పెట్టిన సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే మాట్లాడుతూ... గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP) నెంబర్స్ అసంబద్ధమని పేర్కొన్నారు. అంతేకాదు, ఇది రామాయణం, మహాభారతం, బైబిల్ ఏమీ కాదన్నారు. దీనిపై చిద్దూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్వీట్ చేశారు.

బీజేపీ సంస్కరణలు ఇలా ఉంటాయని చిదంబరం ఎద్దేవా చేశారు. ఇలాంటి సందర్భంలో దేవుడు మాత్రమే కాపాడగలరని ఆయన పేర్కొన్నారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. కాగా, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై సోమవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూఇండియా అనుభవం లేని ఆర్థికవేత్తల నుంచి ప్రజలను ఆ దేవుడు కాపాడుతాడని పేర్కొన్నారు.
జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 4.5గా నమోదైంది. అంతకుముందు క్వార్టర్లో 5 శాతంగా నమోదైంది. దీనిపై పార్లమెంటులో ఎంపీ దుబే మాట్లాడుతూ.. త్వరలో జీడీపీని లెక్కలోకి తీసుకోవడం ఉండదని అభిప్రాయపడ్డారు. 1934కు ముందు ఈ ఎకనమిక్ సూచీ ఉనికిలో లేదని, అదే అంతిమ సత్యం కాదన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications