కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. జూన్ నుండి రవాణా, డెలివరీ వర్కర్స్ ఎంతోమందికి వేతనాలు లేకుండా పోయాయి. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్సుపోర్ట్ వర్కర్స్(IFAT) సర్వే నివేదిక ప్రకారం రవాణా రంగంలో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు లేదా వర్కర్స్ నికర ఆదాయం సున్నాకు పడిపోయింది. మరో ఇరవై శాతం మంది వారానికి రూ.500 నుండి రూ.1500 అతి తక్కువ వేతనం సంపాదించారు.
డ్రైవర్, రవాణా డెలివరీ వర్కర్స్కు ఇంధన ఖర్చులు, వాహన ఈఎంఐలు, కమీషన్లు చెల్లించిన అనంతరం వారి చేతిలో మిగిలేది అతి కొద్ది మాత్రమే. రవాణా, డెలివరీ కార్మికుల్లో ఓలా, ఉబెర్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో, రాపిడో, డుంజో తదితర డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఇందులో చాలామంది లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ఆదాయం పొందలేకపోయారు. దాదాపు 90 శాతం మంది ట్రాన్సుపోర్ట్, డెలివరీ వర్కర్స్ ఎలాంటి కిరాణా, ఆహార సహాయం పొందలేకపోయారు. అలాగే కంపెనీలు, ప్రభుత్వాల నుండి 85 శాతం మంది ఎలాంటి ఆర్థిక సహాయం కూడా పొందలేకపోయారని ఓ సర్వే వెల్లడించింది.

ఈఎంఐ రూ.10వేల నుండి రూ.20వేలు.. ఆదాయం తక్కువ
లాక్ డౌన్ సమయంలో రవాణా రంగంలోని చాలామంది డ్రైవర్లకు ఆదాయాలు లేకుండా పోయాయి. ఏప్రిల్ 15వ తేదీ నుండి పని చేసిన వారిలో చాలామంది ఆదాయం సగటుకంటే రూ.2500 తక్కువగా ఉంది. సర్వే నివేదిక ప్రకారం 57 శాతం మందికి వారానికి 0 రూపాయల నుండి రూ.2,250 మధ్య మాత్రమే సంపాదించారు. అయితే ఈ రవాణా రంగం ఉద్యోగులు నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.10,000 నుండి రూ.20,000 మధ్య ఉంది.

వివిధ అంశాలు పరిగణలోకి తీసుకొని..
ఆసియా పసిఫిక్లోని ఇంటర్నేషనల్ ట్రాన్సుపోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ITF), సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ఇండియా సహకారంతో మార్చి - జూన్ 2020 మధ్య ఐఫాట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో ఆదాయస్థాయిలు, రుణాలు, లాక్ డౌన్ సమయంలో కంపెనీలు, ప్రభుత్వాల నుండి ఆర్థిక ఉపశమనం, ఆర్థిక వ్యవస్థలు తెరవడం ప్రారంభించిన తర్వాత ఆదాయస్థాయిలను ఈ సర్వేలో పరిశీలించాయి.

అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని...
రేషన్, అద్దె వంటి ముఖ్య ఖర్చులు, బ్యాంకులు, క్రెడిట్ సంస్థల ఈఎంఐ వంటి భారం, ఈఎంఐ తాత్కాలిక నిషేధం నేపథ్యంలో వడ్డీ రేటు చెల్లింపు వంటి అంశాలు భారంగా మారినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. మొత్తంగా దాదాపు 70 శాతం వర్కర్స్ ఎలాంటి వేతనం లేకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాస్త కార్యకలాపాలు ప్రారంభమైన లోన్స్, ఖర్చుల తర్వాత ఏమీ మిగలకుండా పోయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications