బెంగళూరు: ఆన్లైన్ ప్లాట్ఫాంల్లోని ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, బ్యూటీషియన్ వంటి వివిధ సేవల్లోని నిపుణులను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ (GST) నెట్ వర్క్ కిందకు తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిపార్టుమెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఈ దిశగా అడుగులు వేస్తోంది.
UrbanClap, HouseJoy, Bro4u వంటి ఆన్లైన్ ఎంగేజ్ సర్వీస్ ప్రొఫెషనల్స్కు జీఎస్టీ నెంబర్ లేదా జీఎస్టీఎన్ను తప్పనిసరి చేయడాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు సీనియర్ అధికారులు వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వచ్చింది.
ఆన్లైన్ మార్కెట్ ద్వారా ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, ఇండివిడ్యువల్ ఫిట్నెస్ ట్రెయినర్స్ వంటి వారు రూ.40 లక్షల లోపు ఆదాయాన్ని సంపాదించుకుంటారు. ఈ మేరకు జీఎస్టీ చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడం అలాగే జీఎస్టీఎన్ తప్పనిసరి చేయడాన్ని పరిశీలిస్తుంది.

ఈ రోజుల్లో ఎంతోమంది ప్రొఫెషనల్స్ వివిధ ఇళ్లల్లోకి వెళ్లి తమ తమ సేవలు అందిస్తుంటారని, వారిని గుర్తించేందుకు తమ వద్ద ప్రత్యేకమైన సదుపాయం ఏమీ లేదని సదరు అధికారి వెల్లడించారు.
వారు జీఎస్టీని చెల్లించవలసిన అవసరం లేదని, అలాగే క్వార్టర్లీ ఫైలింగ్ చేయవలసిన అవసరం లేదని, కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు జీఎస్టీఎన్ ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
వినియోగదారుల భద్రత, అలాగే కార్మికుల హక్కుల పరిరక్షణపై ఉన్న సమస్యల పరిష్కారం కోసం పరిశీలిస్తున్నామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం స్వచ్చంధ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందని, కాబట్టి ఇది ఎవరికీ ఇబ్బందికర అంశం కాదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఈ కామర్స్ విధానాలు ఈ ఆర్థిక సంవత్సరం లోపు వస్తాయని అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications