ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ కారణంగా భారత జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. అయితే వాస్తవిక నష్టం రూ.4 లక్షల కోట్ల నుండి రూ.4.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం వృద్ధిరేటు 1.3 శాతం, మొత్తం ఆర్థిక సంవత్సరానికి మైనస్ 7.3 శాతం క్షీణత ఉండవచ్చునని తెలిపింది. అంతకుముందు 7.4 శాతంగా అంచనా వేసింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలను వరుసగా 7.3 శాతం, 2 శాతంగా అంచనా వేసింది.

సెకండ్ వేవ్ ప్రభావం
కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకు నాలుగు దశల్లో దేశవ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ అమలు చేశారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 24.4%, రెండో త్రైమాసికంలో మైనస్ 7.3% నమోదయింది. లాక్ డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకున్న నేపథ్యంలో మూడో త్రైమాసికంలో 0.4%తో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ త్రైమాసికంపై ప్రభావం పడనుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది.

నష్టం ఎంతంటే
ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం ఇప్పటికే జీడీపీ గణాంకాలను ప్రకటించిన 25 దేశాల లెక్కలను పరిశీలిస్తే వేగంగా అభివృద్ధి చెందిన దేశాల వరుసలో భారత్ అయిదవ స్థానంలో నిలవనుంది. కఠిన లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నామినల్ జీడీపీ 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్లను నష్టపోయింది. అయితే 2021-22 మొదటి త్రైమాసికంలో ఈ నష్టం రూ.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.

వృద్ధి అంచనాల్లో కోత
భారత ఆర్థిక వ్యవస్థ 2021-22 వృద్ధి తొలి అంచనాల్లో బార్క్లేస్ కూడా కోత విధించిన విషయం తెలిసిందే. అంతకుముందు అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.2 శాతానికి తగ్గించింది. థర్డ్ వేవ్ సంక్షోభం తలెత్తి లాక్ డౌన్ మరో కొనసాగడం, వ్యాక్సినేషనలో ఆలస్యం వంటి సవాళ్లు తలెత్తితే వృద్ధి రేటు 7.7 శాతానికి పడిపోతుందని కూడా అంచనా వేసింది. తొలుత ఊహించిన దానికన్నా తీవ్రంగా సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నాయని పేర్కొంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications