12% పెరిగిన ఫ్లిప్కార్ట్ రెవెన్యూ గ్రోత్, నష్టం రూ.3,150 కోట్లు
వాల్మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది ఈ కంపెనీ 12 శాతం అధికంగా రూ.34,610 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2018-19తో పోలిస్తే ఈ కాలంలో నష్టాలను కూడా 18 శాతంతో రూ.3,150 కోట్లకు తగ్గించుకుంది. అంతక్రితం ఏడాది రూ.4,455 కోట్ల నష్టాలు నమోదయ్యాయి.
FY20లో బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం టోప్లర్ అందించిన వివరాల ప్రకారం ఫ్లిప్కార్ట్ ప్రయివేటు లిమిటెడ్ (సింగపూర్)కు గత ఏడాది రూ.4,455 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం ఖర్చులు రూ.37,760 కోట్లుగా ఉంది. ఇందులో ఉద్యోగుల వ్యయాలు రూ.246 కోట్ల నుండి రూ.309 కోట్లకు పెరిగాయి. 2018లో ఫ్లిప్కార్ట్లో 77శాతం వాటాని వాల్మార్ట్ సొంతం చేసుకుంది.
పండుగ సమయంలో ఉద్యోగులకు అమెజాన్ ప్రత్యేక గుర్తింపు బోనస్
ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ సేల్స్ 8.3 బిలియన్ డాలర్లుగా ఉంది. పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ సేల్స్ వాటానే 66 శాతంగా ఉంది. ఈ ఏడాద పండుగ సమయంలో కస్టమర్ గ్రోత్ గత ఏడాదితో పోలిస్తే 88 శాతం పెరిగింది.