కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.5, లీటర్ డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. దీపావళి పండుగ రోజున వినియోగదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ఉపశమనం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ నేటి నుండి అమలులోకి వచ్చింది. మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.

ఆ రాష్ట్రాల్లో తగ్గింపు
మొన్నటి వరకు వరుసగా ఏడు రోజుల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న స్థిరంగా ఉన్నాయి. నేడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో మరింత తగ్గాయి. మోడీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే తొమ్మిది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గించాయి. దీంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన అసోం, గోవా, త్రిపుర, కర్నాటక, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించాయి.

కర్నాటకలో రూ.7 తగ్గింపు
కేంద్రం తగ్గింపుకు అదనంగా గోవా రాష్ట్రం పెట్రోల్ పైన రూ.7, డీజిల్ పైన రూ.7 వ్యాట్ తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ పైన రూ.12, లీటర్ డీజిల్ పైన రూ.17 తగ్గుతుంది.
అసోం, కర్నాటకలు కూడా రూ.7 చొప్పున తగ్గించాయి. ఆ తర్వాత త్రిపుర, గుజరాత్ ముఖ్యమంత్రులు వ్యాట్ తగ్గింపు ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన కూడా అంతేమొత్తం వ్యాట్ తగ్గింపును ప్రకటించింది. బీహార్లో పెట్రోల్ పైన రూ.1.30 పైసలు, డీజిల్ పైన రూ.1.90 పైసలు తగ్గింపు ప్రకటన వచ్చింది.

ఎక్సైజ్ సుంకం ఆదాయం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వానికి నెలకు రూ.8700 ఆదాయం తగ్గుతుంది. అంటే ఏడాదికి రూ.1 లక్ష కోట్ల మేర రెవెన్యూ పైన ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ పైన ఆయా సంవత్సరాల్లో ఎక్సైజ్ డ్యూటీ రాక ఇలా ఉంది. 2014-15లో రూ.99,068 కోట్లు, 2015-16 రూ.178,477 కోట్లు, 2016-17 రూ.242,691, 2017-18 రూ.229,716, 2018-19 రూ.214,369, 2019-20 రూ.223,057, 2020-21 రూ.372,970గా ఉంది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: దానికి సిద్ధంగా ఉండండి అంటూ.. ఇరాన్ మాస్ వార్నింగ్!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications