కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన రంగాలకు భారీ ఉద్దీపనను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ కలెక్షన్స్ సహా కొన్ని ఆర్థిక సూచీలు ఇందుకు సంబంధించి కొన్ని ఆశావహ సంకేతాలు ఉన్నప్పటికీ త్వరలో రాబోయే గణాంకాలు వాస్తవ ఆర్థికస్థితిని మరింత వివరంగా వెల్లడిస్తాయి.
ఇకపోతే, ఉద్దీపనకు సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఆర్థికవేత్తలతో చర్చించారని తెలుస్తోంది. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలో ఉందని, ప్యాకేజీపై మరింత స్పష్టత రావాలని చెబుతున్నారు. ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చినప్పటికీ లాక్ డౌన్ ఆంక్షలను సడలించి, వ్యాపారాలపై విధించిన పరిమితులు తొలగించినప్పుడే ఫలితం ఇస్తుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ విడత ఉద్దీపనలో ఏయే రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలనే అంశం నీతి అయోగ్ పరిశీలిస్తోంది.

ఆర్బీఐ ఇప్పటికే చిన్నస్థాయి రుణగ్రహీతలకు రుణ పునర్నిర్మాణ పథకం ప్రకటించింది. దీనికి తోడు రుణ చెల్లింపుల నిబంధనలు సడలించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మళ్లీ లోన్ మారటోరియం ప్రకటించాలని పలు రంగాలు కోరుతున్నాయి. గత ఏడాది ఆర్బీఐ రుణాల తిరిగి చెల్లింపులకు ఆరు నెలల మారటోరియం కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోను ఈ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
More From GoodReturns

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..



Click it and Unblock the Notifications