Nirmala Sitharaman: వరుసగా వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ పెంచటం చాలా బ్యాంకులకు కలిసొచ్చింది. ప్రధానంగా నష్టాల్లో ఉన్న బ్యాంకులను గతంలో లాభదాయకమైన బ్యాంకుల్లో కలిపేయటం వల్ల వాటి లాభాలు సైతం పెరిగాయి. గతంలో కంటే అధిక ఆదాయం రెండవ త్రైమాసికంలో బ్యాంకులు నమోదు చేయటానికి ఇవి ప్రధాన కారణాలని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.
నిర్మలమ్మ ట్వీట్..
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న 12 బ్యాంకులు రెండవ త్రైమాసికంలో రికార్డు లాభాలను నమోదు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ నిరంతర చర్యల వల్లే నిరర్థక ఆస్తులు తగ్గి బ్యాంకుల పనితీరు బలపడిందని చెప్పారు. ప్రస్తుతం వాటి త్రైమాసిక లాభం రూ.25,685 కోట్లకు చేరుకోవటం దీనికి నిదర్శనమని అన్నారు.

ప్రభుత్వ బ్యాంకుల లాభాలు..
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఎస్బిఐ తన అత్యధిక త్రైమాసిక లాభం రూ. 14,752 కోట్లను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 74% అధికం. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం గత ఏడాది కంటే 59 శాతం పెరిగి రూ.3,312 కోట్లుగా నమోదైంది.

ప్రైవేట్ బ్యాంకులు..
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 20% పెరిగి రూ.10,605 కోట్లకు చేరుకుంది. ఇదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ త్రైమాసికంలో 37 శాతం వృద్ధితో రూ.7,758 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మరో ప్రైవేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ 70 శాతం వృద్ధితో రూ.5,330 కోట్ల లాభాన్ని, కోటక్ మహీంద్రా బ్యాంక్ 27 శాతం వృద్ధితో రూ.2,581 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications