EPFO Scam: ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు హామీ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓలో డబ్బును పొదుపు చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. అయితే కొందరి దొంగల కన్ను ఈ సొమ్ముపై పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1,000 కోట్లు కొట్టేశారు. అసలు ఈ భారీ స్కామ్ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.

ఇంటి దొంగల ప్రమేయం..
EPFO కుంభకోణం.. ముంబైలోని కండివాలి ప్రాంతంలో ఉన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది. కండివాలి PF ఆఫీస్ సీనియర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మచింద్ర బామ్నే, అప్పటి ఎయిర్లైన్ ఉద్యోగుల అక్రమ PF క్లెయిమ్ల పరిష్కారంపై సస్పెండ్ చేయబడినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఉద్యోగులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఒక ఉన్నత అధికారి నియమించబడ్డారు. బామ్నే తన స్నేహపూర్వక ఎయిర్లైన్లోని చాలా మంది దేశీయ ఉద్యోగులను మోసం చేశాడు. అంతే కాదు ఈ కేసులో ఉన్న వ్యక్తులు పలు డాక్యుమెంట్లను కూడా ధ్వంసం చేసి నకిలీ పేపర్లతో ఈ మోసానికి పాల్పడ్డారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో..
ఈ పెద్ద పీఎఫ్ దోపిడీ స్కామ్ 2019లోనే ప్రారంభమైనప్పటికీ.. లాక్డౌన్ సమయంలో అది వేగవంతమైందని ఈపీఎఫ్వోకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈపీఎఫ్ఓ జెట్ ఎయిర్వేస్ పైలట్లను సంప్రదించింది. వారిని తమ భారతీయ పాన్ కార్డ్ వివరాలను అందించాలని కోరింది. బ్యాంక్ వారు PF డబ్బును తిరిగి ఇవ్వడానికి చెక్కులు అడుగుతున్నారు. విదేశీ పైలెట్లు సైతం తమ డబ్బు కావాలంటూ ఎయిర్ లైన్ కంపెనీకి మెయిల్స్ పంపుతున్నారు.

బోగస్ ఖాతాల వ్యవహారం..
నిందితులు ఉద్యోగుల పీఎఫ్ డబ్బును తస్కరించేందుకు బోగస్ ఖాతాలు తెరిచి, ఆపై జెట్ ఎయిర్వేస్తో సహా ఇతర కంపెనీల్లో క్లెయిమ్లను మోసపూరితంగా సెటిల్ చేసినట్లు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు ప్రభాకర్ బానాసురే తెలిపారు. ఈ నిబంధనల ఉల్లంఘన, పన్ను ఎగవేత కారణంగా EPFO సుమారు రూ. 1,000 కోట్ల నష్టపోయినట్లు ఆయన వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడుతుందని.. ఈ విషయం ఇప్పటికే కార్మిక శాఖ మంత్రికి దృష్టికి వెళ్లినట్లు ఆయన చెప్పారు.

EPFO సమావేశం..
ఈ వ్యవహారం బయట పడటంతో సీరియస్ గా EPFO దర్యాప్తు చేసింది. ఈ విషయంలో జూలై 29-30న సంస్థలోని ఐఏఎస్ అధికారులు కార్మిక మంత్రిని కలిశారు. జెట్ ఎయిర్వేస్ అంశంపై సమావేశంలో మాట్లాడినట్లు ట్రస్టీ సభ్యుడు సుకుమార్ దామ్లే తెలిపారు. దీనిపై త్వరలోనే తగిన చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

CBI దర్యాప్తుకు డిమాండ్..
రూ.1,000 కోట్లను ఇంటి దొంగలు మాయం చేసిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జెట్ ఎయిర్వేస్ పీఎఫ్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని డిమాండ్ చేశానని ప్రభాకర్ బాణాసురే తెలిపారు. చీఫ్ విజిలెన్స్ జితేంద్ర ఖరే ఈ విషయాన్ని విచారించినప్పటికీ, ఆయన కుంభకోణం జరిగిన బ్రాంచ్ లోనే పనిచేస్తున్నాడు. ఈ వ్యవహారంలో చాలా మంది వైట్కాలర్ నిందితుల ప్రమేయం ఉందని.. అందుకే దీని దర్యాప్తు సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని భావిస్తున్నారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications