కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండేళ్లకు పైగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. అయితే ఇటీవల కరోనా ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గడంతో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. అయితే కార్యాలయాలకు రావడానికి కొంతమంది ఉద్యోగులు ఆసక్తి చూపించడం లేదు. కార్యాలయానికి రమ్మంటే రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు. నైపుణ్య ఉద్యోగులను వదులుకోవడానికి కంపెనీలు ఇష్టపడటం లేదు. కంపెనీలు ఇరుకున పడుతున్నాయి. కార్యాలయానికి రమ్మన్నందున పలు కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు రాజీనామా చేశారు.

ఆఫీస్కు రమ్మంటే రాజీనామా
ఉదాహరణకు మే 12వ తేదీ నాటికి అంతకుముందు 60 రోజుల్లో బైజూస్కు చెందిన వైట్ హ్యాట్ జేఆర్ నుండి వందలాదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు వెళ్లిపోయారు. బ్లూమ్ బర్గ్ సర్వే ప్రకారం రిమోట్ వర్క్కు తమ మేనేజర్ అనుమతించని పక్షంలో 1000 మంది ఉద్యోగుల్లో 39 శాతం మంది తమ ఉద్యోగం వదిలి వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది.
మిల్లీనియల్స్, జెన్ జెడ్ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసి, సరైన ఫలితం ఇస్తారని 49 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

అన్ని దేశాల్లోను
వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు ముగింపు పలికి, ఆఫీస్లకు రమ్మని పిలిస్తే, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉద్యోగులు కంపెనీకి గుడ్ బై చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో గ్రేట్ రిజిగ్నేషన్ నవంబర్ నుండి ప్రారంభమైంది. వేతనాలు పెంచకపోవడంతో పాటు, ఆఫీస్ నుండి పని చేయాలనే ఒత్తిడి కారణం. దీంతో ఐటీ కంపెనీలు వర్క్ ఎట్ లొకేషన్ డిమాండ్ పైన వెనక్కి తగ్గుతున్నాయి.

వేతన పెంపు
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ బడ్జెట్ను రెండింతలు చేయనుందని తెలుస్తోంది. ఉద్యోగులకు స్టాక్స్ కేటాయింపుల్లో కనీసం 25 శాతం వృద్ధి, ప్రతిభ ఆధారంగా వేతనాలు పెంచుతామని ప్రకటించింది. ప్రతిభ ఆధారంగా వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ సందేశంలో తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు కాస్త ఎక్కువగానే పని చేస్తున్నారు. కంపెనీలు కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆఫీస్కు రావాలని ఒత్తిడి చేస్తుండటంతో పలువురు ఉద్యోగులు రిజైన్ చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications