దేశీయంగా ఈ-కామర్స్, బ్యాంకింగ్, టెలీకాం కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనాభా పెరుగుతున్న కొద్దీ ఖాతాదారుల సంఖ్య పెరగడం సహజమేకదా. ఇలాంటప్పుడు ఈ సంస్థలు కూడా తమ కస్టమర్లకు తగిన విధంగా సేవలు అందించడమే కాకుండా సమస్యలు వచ్చినప్పుడు వాటిని వీలైనంత వేగవంతంగా పరిష్కరించాలి. కాకపోతే వారికి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కస్టమర్లు తమకు సమస్య వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు మొదట ఫిర్యాదు చేస్తుంటారు. అయితే కొన్ని సంస్థలు వీటిని పరిష్కరించడంపై ఆ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపవు. లేదా ఎక్కువ జాప్యం చేస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో కస్టమర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఒక జాతీయ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. దీనికి ఫిర్యాదు చేస్తే త్వరగా సమస్యను పరిష్కారం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ హెల్ప్ లైన్ కు విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆవివరాలు ఏమిటంటే...

ఈ- కామర్స్ కంపెనీలపైనే ఎక్కువ
* వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ- కామర్స్ కంపెనీల వినియోగదారులే ఎక్కువగా ఫిర్యాదు చేశారు.
* ఈ కంపెనీల్లో ఎక్కువగా ఫ్లిప్ కార్ట్ పై పిర్యాదులొచ్చాయి. ఫిర్యాదుల జాబితాలో ఫ్లిప్ కార్ట్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం గమనార్హం.
* ఐదు ఫిర్యాదుల్లో ఒకటి ఈ-కామర్స్ కంపెనీపై వచ్చింది.
* ఈ-కామర్స్ తో పాటు బ్యాంకింగ్, టెలికామ్ రంగ కంపెనీలపై కూడా ఎక్కువగానే ఫిర్యాదులు వచ్చాయి.

టాప్ 5 కంపెనీలు ఇవే...
వినియోగదారుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన టాప్ 5 కంపెనీల్లో
* ఫ్లిప్ కార్ట్
* రిలయన్స్ జియో
* అమెజాన్
* ఎస్ బీ ఐ
* వొడాఫోన్
* ఎయిర్ టెల్

50 లక్షలకు పైగా ఫిర్యాదులు
* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీలపై 50 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే కంపెనీల సర్వీసులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు
* ఈ ఫిర్యాదుల్లో లక్షకు పైగా ఫిర్యాదులు ఈ-కామర్స్ కంపెనీలపై వచ్చాయి.
* బ్యాంకులపై 41,600, టెలికాం కంపెనీలపై 29,400 ఫిర్యాదులు వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీలపై 5.65 లక్షల ఫిర్యాదులు రాగా వీటిలో లక్షకు పైగా ఫిర్యాదులు ఈ - కామర్స్ కంపెనీలపై ఉన్నాయి.
* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఇంకా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ - కామర్స్ కంపెనీలపై వస్తున్న ఫిర్యాదులు ఏమిటంటే...
* ఈ- కామర్స్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన ఉత్పత్తులు సరిగ్గా ఉండకపోవడం, ఆర్దరు చేసినవి డెలివరీ కావడంలో జాప్యం కావడం, ఒక వస్తువుకు బదులు మరొకరి డెలివరీ కావడం తదితర ఫిర్యాదులున్నాయి.
* టెలికం కంపెనీల విషయానికి వస్తే అధికంగా బిల్లు వేయడం, డేటా తగ్గించడం, కనెక్టివిటీ సమస్యలు వంటివి ఉన్నాయి.

రెండు నెలల్లో పరిష్కారం
* వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకుగాను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక మొబైల్ యాప్ తెచ్చింది. దీని ద్వారా ఫిర్యాదు చేస్తే 60 రోజుల్లో పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications