అమెరికా అధ్యక్ష పదవి నుండి దిగిపోయే ఒకరోజు ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ చైనాకు షాకిచ్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు యాప్స్ పైన నిషేధం విధించిన ట్రంప్ తాజాగా మరో చర్యకు సిద్ధమవుతున్నారు. చైనాని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. గతంలోనే హువేవేను టార్గెట్ చేసిన ఆయన, తాజాగా మరోసారి విరుచుకుపడుతున్నారు. ఈ చైనా టెలికం దిగ్గజం 5G టెక్నాలజీకి ప్రసిద్ధి. అమెరికాలోను పలు దిగ్గజ కంపెనీలకు హువావే పరికరాలు సరఫరా చేస్తుంది. ఈ దిశగా ట్రంప్ చర్యలు తీసుకోనున్నారు.

అదే ట్రంప్ టార్గెట్
ఇంటెల్ సహా ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హువావేకు పరికరాలు సరఫరా చేస్తాయి. ఇందుకు సంబంధించిన అనుమతులను రద్దు చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఎగుమతుల కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులను కూడా తిరస్కరించే యోచనలో ఉన్నారు. దాదాపు 150 అనుమతులను ట్రంప్ రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ దాదాపు 120 బిలియన్ డాలర్లు. మరో 280 బిలియన్ డాలర్ల ఒప్పందాల కోసం చర్చలు జరుగుతుండగా, ట్రంప్ చర్యలతో వీటిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. హువావేకు అమెరికా నుండి ఎలాంటి పరికరాలు అందవద్దనేది ట్రంప్ టార్గెట్గా కనిపిస్తోంది.

ట్రంప్ పిలుపు.. యూకే రద్దు
హువావే టార్గెట్గా పలు అమెరికా కంపెనీలకు అమెరికా వాణిజ్య శాఖ నోటీసులు ఇచ్చింది. ఇరవై రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. 5G టెక్నాలజీకి సంబంధించి హువావే ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని భావిస్తోంది. ట్రంప్ ఆ సంస్థకు కొరకురాని కొయ్యలా మారారు. చైనా కంపెనీలు, టెక్నాలజీ వల్ల సమాచార దోపిడీ ఉందని ఆరోపిస్తూ వస్తున్నారు. హువావేను బహిష్కరించాలని ఇతర దేశాలను కూడా కోరారు. దీంతో హువావేతో ఉన్న ఒప్పందాన్ని ఇప్పటికే బ్రిటన్ రద్దు చేసుకుంది.

లైసెన్స్ రద్దు
ఇందుకు సంబంధించి ఇంటెల్ కార్ప్ సహా ఇతర సంస్థలు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు సంస్థలకు చెందిన ఎనిమిది లైసెన్స్ రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. జపానీస్ ఫ్లాష్ మెమోరీ చిప్ మేకర్ కియోక్సియా కార్ప్కు సంబంధించి ఒక లైసెన్స్ రద్దయినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ కంపెనీ తోషిబా మెమోరీ కార్ప్ పేరుతో ఉంది. దీనిపై ఈ కంపెనీ స్పందించాల్సి ఉంది.
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications