హైదరాబాద్: కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెల్ల రేషన్ కార్డు కలిగిన వారి అకౌంట్లలో డబ్బులు వేస్తోన్న విషయం తెలిసిందే. పలువురి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి. అయితే బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డు లింక్ లేని వారి ఖాతాల్లో జమ కాలేదు. దీనిపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

బ్యాంకు ఖాతా-ఆధార్ లింక్ లేని వారికి నేరుగా నగదు
తెలంగాణలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డు లింక్ లేని వారి ఖాతాల్లో నగదు జమ కాలేదని, అలాంటి వారికి నేరుగా నగదు అందిస్తామని చెప్పారు. 5 లక్షల 21 వేల 640 కార్డుదారులకు నగదును బ్యాంకుల్లో వేయలేకపోయామన్నారు. వారందరికీ నేరుగా లేదా తపాలా ద్వారా లబ్ధిదారులకు నగదు అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.500, రూ.1,500, జమ చేస్తోన్న విషయం తెలిసిందే.

అలాంటి వదంతులు నమ్మవద్దు
వలస కార్మికులకు 12 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి బియ్యం, కుటుంబానికి రూ.500 అందించామని చెప్పారు. బ్యాంకులో క్రెడిట్ అయిన నగదు తీసుకోకుంటే వెనక్కు వెళ్లిపోతుందనే వదంతులు నమ్మవద్దని చెప్పారు. ఆ నగదును ఎప్పుడైనా తీసుకోవచ్చునని చెప్పారు. బ్యాంకుల వద్ద జనం గుమికూడకుండా భౌతిక దూరం పాటించి నగదు తీసుకోవాలని సూచించారు.

పోస్టుమాస్టర్ జనరల్ ఖాతాకు జమ
లాక్ డౌన్ నేపథ్యంలో మొత్తం 87.54 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం, ప్యామిలీకి రూ.1,500 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 91 శాతం మంది బియ్యం తీసుకున్నారు. ఇప్పటికే 74,07,186 మందికి నగదు బదిలీ చేశామని, మిగిలిన 5.21 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామని, వారికి పోస్టాఫీస్ ద్వారా నగదు బదిలీ చేసేందుకు రూ.78.25 కోట్లను పోస్టుమాస్టర్ జనరల్ ఖాతాకు శనివారం జమ చేసినట్లు తెలిపారు. పేదవారికి అందరికి ప్రభుత్వం ప్రకటించిన సొమ్ము అందిస్తామన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications