న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిన తరువాత కూడా ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా తీరు మారలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఎయిరిండియా గత సంవత్సరం తన మాతృసంస్థ టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ- తన నైజాన్ని మార్చుకోలేకపోతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. భారీగా జరిమానా విధించింది. దీని విలువ 10 లక్షల రూపాయలు.
ఓ ప్రయాణికుడిని విమానం ఎక్కనివ్వకపోవడమే దీనికి కారణం. ఆ ప్రయాణికుడి వద్ద వ్యాలిడ్ టికెట్ ఉన్నప్పటికీ.. విమానం ఎక్కించుకోలేదు. దీనిపై ఆ ప్రయాణికుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ఫిర్యాదు చేశారు. టికెట్ నంబర్, ఇతర వివరాలను డీజీసీఏ ఫిర్యాదుల పరిష్కార వేదిక దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై డీజీసీఏ విచారణ నిర్వహించింది. ఈ వ్యవహారంలో తప్పు ఎయిరిండియాదేనని తేలడంతో 10 లక్షల రూపాయల పెనాల్టీని విధించింది. దీనితో పాటు ఎయిరిండియా కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తీరు మార్చుకోవాలని సూచించింది. ఫిర్యాదులను పరిష్కరించడానికి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

హైదరాబాద్ సహా బెంగళూరు, న్యూఢిల్లీ నుంచి తరచూ ఎయిరిండియా సహా కొన్ని పౌర విమానయాన సంస్థలపై ఫిర్యాదులు అందుతుండటంతో డీజీసీఏ ప్రత్యేకంగా నిఘా ఉంచింది. వ్యాలిడ్ టికెట్ ఉన్నప్పటికీ.. విమానాన్ని ఎక్కించుకోవకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. తాము విధించిన మార్గదర్శకాలను ఆయా విమానయాన సంస్థలు అనుసరించట్లేదని స్పష్టం చేసింది.
వ్యాలిడ్ టికెట్ ఉన్న ప్రయాణికుడిని ఎక్కించుకోకపోతే- సరిగ్గా గంట వ్యవధిలో ప్రత్యామ్నాయ విమాన సర్వీస్లో సీట్ను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని డీజీసీఏ స్పష్టం చేసింది. ఎలాంటి అదనపు మొత్తాన్ని కూడా ఆ ప్రయాణికుడి నుంచి వసూలు చేయకూడదని సూచించింది.
24 గంటల వ్యవధిలో విమాన సర్వీస్ను అందుబాటులోకి తీసుకుని రాకపోతే 10,000 రూపాయలు, ఆ తరువాతి 24 గంటల్లో కూడా ప్రయాణించే ఏర్పాటు చేయకపోతే 20,000 రూపాయలను సదరు ప్రయాణికుడికి పరిహారంగా అందజేయాల్సి ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications