న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన అనంతరం తమ భవిష్యత్ అవసరాల కోసం కోట్లాదిమంది ఉద్యోగులు డిపాజిట్ చేసుకునే చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటు (EPF interest rate)ను మరోసారి కుదించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కుదిస్తూ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టీలు పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదం తెలపడంతో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గింది.

ఆ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం..
ఇంత తక్కువ మొత్తానికి ఈపీఎఫ్ వడ్డీరేటును కుదించడం.. 40 సంవత్సరాల ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈపీఎఫ్ వడ్డీ రేటును కుదిస్తూ గత ఏడాది డిసెంబర్లో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కీలక ప్రతిపాదనలను రూపొందించారు.
అస్సాంలోని గువాహటిలో నిర్వహించిన సమావేశంలో దీనికి తుదిరూపం ఇచ్చారు. ఈపీఎఫ్ డిపాజిట్లపై ఇదివరకు అమలులో ఉన్న వడ్డీ రేటును 8.4 నుంచి 8.1 శాతానికి కుదించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.

40 బేసిస్ పాయింట్లు కోత..
ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్లపై ఇంత కనిష్ఠ స్థాయిలో వడ్డీరేటును నిర్ధారించడం- 40 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1977-78 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది శాతం. ఇప్పుడు దాదాపు అదే స్థాయికి పడిపోయింది. 40 బేసిస్ పాయింట్లకు తగ్గించినందు వల్ల వడ్డీ రేటు 8.4 నుంచి 8.1 శాతానికి దిగజారింది. దీని ప్రభావం ఆరుకోట్ల మంది ఉద్యోగులపై పడింది. 2020 మార్చిలో చివరిసారిగా ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.4గా నిర్ధారించింది కేంద్రం. రెండేళ్లకే మళ్లీ దీన్ని 8.1కి మరింత తగ్గించింది.

ఆర్థికశాఖకు తీర్మానం..
తాజాగా ఈ ప్రతిపాదనలను నిర్మల సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీన్ని ర్యాటిఫై చేసింది. ఈ సంవత్సరం మార్చి 31లో కొత్తగా మరో 15.32 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12.85 లక్షలుగా నమోదైంది. ఫిబ్రవరితో పోల్చుకుంటే- మార్చిలో 19 శాతం మంది కొత్తగా ఈపీఎఫ్లో చేరారు.

కుదింపు ఇలా..
2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల భవిష్యనిధిపై ఉన్న వడ్డీ రేటు 8.8 శాతం. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అమలులో ఉన్న వడ్డీ రేటు 8.65 శాతం. ఆ మరుసటి సంవత్సరమే అంటే 2017-18లో దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని 8.55 శాతానికి తగ్గించింది. అప్పటి నుంచీ ఇది ప్రతి సంవత్సరం దిగజారుతూ వస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5గా నిర్ధారించింది. ఇప్పుడు మళ్లి దీన్ని తాజాగా సవరించింది. 8.1 శాతానికి కుదించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications