ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? అయితే మీకో ఊరట. ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు CBDT గురువారం ప్రకటించింది. కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువును ఇచ్చింది. మరోవైపు, ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన కొత్త ఐటీ వెబ్ పోర్టల్లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాలేదు. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న గడువును ఐటీ శాఖ డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్సైట్(www.incometax.gov.in)ను ఇన్ఫోసిస్ అందుబాటులోకి తీసుకురాగా అప్పటి నుండి టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్కు కేంద్రం డెడ్లైన్ విధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సోమవారం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సలీల్ పరేఖ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గడువును నిర్దేశించారు.

సెప్టెంబర్ 15వ తేదీలోగా పోర్టల్కు సంబంధించిన లోపాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పోర్టల్ అందుబాటులోకి వచ్చిన మూడు నెలలకు వస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. సమస్యలు కొనసాగుతుండటంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications