ముంబై: కరోనా మహమ్మారి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని, అన్ని రంగాలపై అధికంగా ప్రభావం కనిపించిందని ఇన్ఫోసిస్ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. వివిధ రంగాల్లోని వ్యాపారాలపై బడ్జెట్, సరఫరా వ్యవస్థలు, ఉద్యోగుల లభ్యత తదితర అంశాల ప్రభావం ఏ మేరకు పడిందని ఈ కంపెనీలు సంయుక్తంగా నో వేర్ టు హైడ్: ఎంబ్రాసింగ్ ది మోస్ట్ సిస్మిక్ టెక్నాలజికల్ అండ్ బిజినెస్ చేంజ్ ఇన్ అవల్ లైఫ్ టైమ్ అధ్యయనం చేశాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రిమోట్ వర్క్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితికి సరైన పరిష్కారమని ఈ సర్వేలో పాల్గొన్న 51 ఆర్గనైజేషన్లు అభిప్రాయపడ్డాయి.

2008 కంటే ప్రభావం ఎక్కువ
HFS రీసెర్చ్-ఇన్ఫోసిస్ సంయుక్తంగా 400 గ్లోబల్, 2000 ఎగ్జిక్యూటివ్స్ను సర్వే చేసింది. మహమ్మారి కారణంగా చితికిపోయిన వ్యాపారాలు ఏ మేరకు కోలుకుంటాయ, ప్రస్తుత పరిస్థితిని అధిగమించి ఎలా ముందుకెళ్తున్నాయో తెలుసుకునేందుకు సర్వే ద్వారా ప్రయత్నించారు. 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు పెద్దవని, కంపెనీలపై భారీ ప్రభావం చూపిందని 70 శాతం మంది/సంస్థలు అభిప్రాయపడ్డాయి.

ఇవి ఐటీ వ్యయాలను పెంచుతాయి
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడి నుండైనా వర్క్ లేదా హైబ్రిడ్ వర్క్ ఫోర్స్ నమూనాతో ముందుకు వెళ్లే వెసులుబాటు ఉందని 51 శాతం సంస్థలు తెలిపాయి. బ్యాంకింగ్స్, ఇన్సురెన్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, హై-టెక్ ఇండస్ట్రీల్లోకి సంక్షోభ సమయంలో పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. క్లౌడ్, సైబర్ భద్రత, ఆధునికీకరణ డిజిటల్ వ్యాపార నమూనాలను, ఐటీ వ్యయాలను పెంచుతాయని సర్వేలో వెల్లడైంది. యాంత్రీకరణ, డిజిటల్ వ్యాపార నమూనాలకు మారడంతో పాటు ఖాతాదురుల అవసరాలకు తగినట్లు త్వరగా, పోటీగా స్పందించేందుకు హైపర్ స్కేల్ క్లౌడ్స్ వినియోగించుకున్నాయి.

మార్పును స్వీకరించేందుకు
మార్పును స్వీకరించందుకు, వ్యాపారాలను డిజిటలీకరణ చేసేందుకు కార్పోరేట్ ప్రపంచానికి కరోనా దోహదపడిందని వెల్లడించారు. కరోనా తర్వాత పరిస్థితులకు అనుగుణంగా పని విధానం మారాల్సిన అవసరాన్ని 90 శాతం సంస్థలు గుర్తించాయి. ఆఫీస్ వాతావరణం కొనసాగుతుందని కేవలం 37 శాతం కంపెనీలు చెప్పాయి. తమ వ్యాపారాలు అస్థిరత నుండి మెరుగైన స్థితికి చేరుకుంటాయని 65 శాతం మంది, డిజిటల్ పరివర్తనకు వేగంగా మారే ప్రణాళికను 60 శాతం కంపెనీలు, ఉత్పత్తి - సేవల పోర్ట్పోలియోను మార్చుకోవడం ద్వారా విలువైన ఖాతాదారుల వ్యాల్యూను పెంచుకునేందుకు 70శాతం సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications