18 ఏళ్ల పైబడినవారికి.. కరోనా వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
యావత్ భారత్ కరోనా వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తోంది. తొలుత హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సీన్ అందించారు. ఆ తర్వాత 45 ఏళ్లు, అంతకంటే పైవారికి ఇచ్చారు. మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. అయితే దీని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరూ దేశవ్యాప్తంగా కరోనా టీకాలకు అర్హులు.
ఇప్పటికే నిన్నటి నుండి అంటే ఏప్రిల్ 28వ తేదీ నుండి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయింది. యువత కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్నటి నుండి ఇది ప్రారంభమైంది. ఏప్రిల్ 28న(బుధవారం) సాయంత్రం నాలుగు గంటల నుండి కోవిన్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్యసేతు అదికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. 18 ఏళ్లు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ మే 1వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ 19 టీకాల కోసం కొవిన్ యాప్, ఆరోగ్యసేతు యాప్, ఉమాంగ్ యాప్స్ ద్వారా ఆసక్తిగల వారు కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.