కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక ట్రాన్సాక్షన్స్ హాబిట్ను మార్చివేసింది. కర్ఫ్యూ, లాక్ డౌన్ కారణంగా ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని ప్రజలు భయాందోళనతో తమ వద్ద డబ్బును అట్టిపెట్టుకుంటున్నారు. ఇందుకోసం ATMల నుండి పెద్ద ఎత్తున నగదును ఉపసంహరించుకుంటున్నారు. తరుచూ బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందోననే భయం, కేవైసీ నిబంధనలతో ఆసుపత్రులు వంటి వాటిల్లో రూ.2 లక్షలకు మించి నగదు చెల్లింపులకు అనుమతులు ఇందుకు దోహదపడుతోంది.

డబ్బులు దాచేస్తున్నారు
కరోనా నగదు వినియోగంపై ప్రజల ప్రవర్తనలో స్పష్టమైన మార్పును తీసుకు వచ్చినట్లుగా తేటతెల్లమవుతోంది. ATMల నుండి పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకుంటున్నప్పటికీ, దానిని ఇంట్లోనే అట్టిపెట్టుకొని చెల్లింపులను మాత్రం డిజిటల్ పద్ధతిలో చేస్తున్నారు. రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ, డిజిటల్ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ గతంలో కంటే 20 శాతం మేర పెరిగిందని, ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపులు స్థిరంగా ఉంటున్నాయి.

నగదు ఉపసంహరణ
అంతకుముందు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సగటున రూ.2000-రూ.3000 వరకు ఉపసంహరణ ఉండేది. ఇపుడు మాత్రం 20 శాతం పెరిగి రూ.3,000-రూ.4,000 వరకు ఉంది. సగటున రూ.1000 వరకు ట్రాన్సాక్షన్స్ను యూపీఐ ద్వారా చేస్తున్నారు. ఐఎమ్పీఎస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ రూ.6,000-రూ.7,000 నుండి రూ.9,000కు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చి 26వ తేదీ వరకు దేశంలో రూ.28,58,640 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉంటే ఈ నేల 7వ తేదీ నాటికి రూ.29,39,997 కోట్లకు చేరుకుంది. ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిని అనుమతించి ఉంటే ఇది మరింత పెరిగేదని అంనా.

ఆధార్ ఏటీఎం..
ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు కీలకమైన ఆధార్ ఏటీఎమ్లో ఉపసంహరణలు భారీగా పెరిగాయి. 2020-21 నాలుగో త్రైమాసికంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా రూ.10,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ.7650 కోట్లుగా ఉన్నాయి. ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ గత ఏడాది రూ.30,000 కోట్లకు పైగా చేరుకున్నాయని, తమ రోజువారీ ట్రాన్సక్షన్స్ గరిష్ఠంగా రూ.165 కోట్లకు చేరాయని స్పైస్ మనీ వెల్లడించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications