కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. భారత్లోను ఓ కేసు నమోదయింది. గురువారం నాటికి కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 170కి చేరుకుంది. మరో 1700 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బాధితుల సంఖ్య దాదాపు ఎనిమిది వేలకు చేరుకుంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో హువాయి ప్రావిన్స్ వారే ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన వారు దాదాపు 40 మంది చనిపోయారు. ప్రతి రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. మార్కెట్లను ఈ వైరస్ దెబ్బతీస్తోంది.

దూసుకెళ్లిన జపాన్ ఈ కంపెనీ షేర్లు
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఢీలాపడగా, జపాన్లోని ఓ కంపెనీ షేర్లు మాత్రం భారీగా పుంజుకుంటున్నాయి. గత ఏడు సెషన్లలో ఈ కంపెనీ షేర్లు మూడు రెట్లకు పైగా దూసుకెళ్లింది. జపాన్కు చెందిన కవామోటో కార్పోరేషన్ వైద్య పరికరాలను తయారు చేస్తుంది.

మూడున్నర రెట్లు పెరుగుదల
కరోనా వైరస్ కారణంగా ముఖానికి తగిలించుకునే మాస్కులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఈ కంపెనీ షేర్లు మూడు రెట్లకు పైగా పెరిగాయి. మంగళవారం నాడు ఈ కంపెనీ షేర్లు 23.65 శాతం పెరిగి JPY 2,091 వద్ద క్లోజ్ అయ్యాయి. జనవరి 17వ తేదీన JPY 591 ఉన్న షేర్లు ఇప్పుడు 3.5 రెట్లు పెరిగాయి.

అమెరికా కంపెనీ షేర్లు కూడా
అలాగే, మరో అమెరికన్ డిస్పోజబుల్ ప్రొటక్టివ్ కంపెనీ అల్ఫా ప్రో టెక్ లిమిటెడ్ షేర్లు జనవరి 17వ తేదీ నుంచి 2.2 శాతం పెరిగాయి. గత సోమవారం ఈ కంపెనీ షేర్లు 7.7 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యాయి. ఇది 28.33 శాతం లాభం. జనవరి 17న ఈ షేర్ 3.51 డాలర్లుగా ఉంది. కరోనా వైరస్ కారణంగా ముఖానికి ధరించే మాస్కుల షేర్లు భారీగా పెరుగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications