గత మార్చి, ఏప్రిల్ లో ఆకాశాన్నంటిన వంట నూనె ధరలు జూలై నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ధరలు భారీగా పెరిగిన దశలో కేంద్రం వంట నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది.

సుంకం..
2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది. ప్రస్తుతం 'ముడి' పామాయిల్, సోయాబీన్ నూనె, సన్ ఫ్లవర్ నూనెపై ఎలాంటి దిగుమతి సుంకం లేదు. అయితే 5% అగ్రి సెస్సు, 10 శాతం సంక్షేమ (సోషల్ వెల్ఫేర్) సెస్సును పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మూడు రకాల నూనెలపై 5.5 శాతం సుంకం వసూలు చేస్తున్నారు.

ప్రస్తుత సుంకాలే..
ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని పరోక్ష పన్నుల కేంద్ర మండలి ప్రకటించింది.శుద్ధిచేసిన (రిఫైన్డ్) పామోలిన్, పామాయిల్కు బేసిక్ కస్టమ్స్ సుంకం 12.5 శాతం కాగా.. సంక్షేమ సెస్సు 10% వసూలు చేస్తున్నారు.

లీటర్ కు రూ.176..
రిఫైన్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెపై బేసిక్ కస్టమ్స్ 17.5 శాతం కాగా.. 10 శాతం సోషల్ వెల్ఫేర్ సెస్సును లెక్కలోకి తీసుకుంటే వర్తించే సుంకం 19.25 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం వేరుశనగ లీటర్ కు రూ.188 ఉండగా.. ఆవ నూనె రూ.172, వనస్పతి రూ. 152, సోయాబీన్ రూ.156, పొద్దుతిరుగుడుపువ్వు రూ.176, పామాయిల్ రూ.136గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications