కరోనావైరస్ ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్న నేపథ్యంలో సాఫ్టువేర్ రంగంలోని పలు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ను ఇచ్చాయి. టెక్ దిగ్గజాలు విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

చైనా సహా ఆ దేశాలకు వెళ్లకండి
చైనా ప్రధాన భూభూగంలోని హాంగ్కాంగ్, మకావ్ తదితర ప్రాంతాలకు వెళ్లవద్దని విప్రో తమ ఉద్యోగులను ఆదేశించింది. దీనిపై మళ్లీ ప్రకటన చేసేవరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, ఇటలీ వంటి దేసాలకు కూడా వెళ్లవద్దని సూచిస్తున్నట్లు విప్రో తెలిపింది.

ఆ తర్వాతే ఆఫీస్కు రండి
తమ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఎవరైనా చైనా తదితర కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్తే వారు స్వచ్చంధంగా రెండు వారాల పాటు ఇంటి నుండి పని చేయాలని, ఆ తర్వాత ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆఫీస్కు రావాలని పేర్కొంది.

వూహాన్లో ఉద్యోగులు లేరు
కరోనా వైరస్ పుట్టిన వూహాన్లో తమకు ఉద్యోగులు ఎవరూ లేరని విప్రో తెలిపింది. తమ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ ఉంటే స్వచ్చంధంగా వారు పర్యవేక్షణలో ఉండాలని సూచించింది. తమ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది.

ఎప్పటికప్పుడు క్లీనింగ్
అన్నిచోట్ల స్క్రీన్లను ఏర్పాటు చేశామనిస సర్జికల్ మాస్క్లను అందుబాటులో ఉంచామని, తరుచూ కార్యాలయాలను క్లీన్ చేస్తున్నామని తెలిపింది. ఉద్యోగులు పరిశుభ్రత పాటించాలని సూచించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే ఉద్యోగి వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించింది. పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపింది. కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులకు సూచనలు చేసింది. ఉద్యోగుల ప్రయాణాలపై నిర్బంధం విధించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications