ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్లో లక్షకు పైగా ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఈ ఐటీ దిగ్గజం లక్ష మంది అనుభవజ్ఞులను, మరో 30,000 ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఇటీవల సాఫ్టువేర్ రంగంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. కరోనా తర్వాత డిజిటల్ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యత పెరగడంతో ఆ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది.

ఉద్యోగుల వలసలు
కాగ్నిజెంట్ ఉద్యోగుల విషయంలో ఓ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళ్తున్నారు. దీంతో నియామకాలపై దృష్టి సారించింది. ఉద్యోగుల వలసలను నేపథ్యంలో ఈ ఖాళీలను పూరించేందుకు కంపెనీ ఈ ఏడాది 1,00,000 మందిని తీసుకోనుంది. ఈ మేరకు గురువారం కాగ్నిజెంట్ ప్రకటించింది. 2021లో అనుభవం కలిగిన నిపుణులతో పాటు 30,000 మంది ప్రెషర్స్ను తీసకుంటామని తెలిపింది. 2022లో 45,000మంది కొత్త గ్రాడ్యుయేట్స్ను చేర్చుకుంటామని వెల్లడించింది.

భారత్లో 2 లక్షల మంది
జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడి అనంతరం ఓ భేటీలో కంపెనీ సీఈవో బ్రియాన్ హాంప్షైర్స్ మాట్లాడారు. ఉద్యోగుల వలస ప్రధాన ఆందోళనగా చెప్పారు. ఈ జూన్ త్రైమాసికంలో కంపెనీ నుండి వలసలు రికార్డ్స్థాయిలో 31 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మేర ఉద్యోగులు ఉండగా, భారత్లో 2 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. వలసలు తగ్గించేందుకు వేతనాల పెంపు, ప్రమోషన్స్, నైపుణాలను పెంపొందించడం, జాబ్ రొటేషన్స్ వంటి చర్యల్ని చేపడుతున్నారు.

కంపెనీ నికర లాభం
ఇదిలా ఉండగా, ఈ కంపెనీ జూన్ త్రైమాసికంలో 512 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 361 మిలియన్ డాలర్ల నికర లాభంతో పోలిస్తే ఇది 41.8 శాతం అధికం. కంపెనీ ఆదాయం 400 కోట్ల డాలర్ల నుంచి 14.6 శాతం వృద్ధి చెంది 460 కోట్ల డాలర్లకు చేరుకుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications