మేజ్ రాన్సమ్వేర్ దాడితో ఇబ్బందులకు గురైనట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ప్రకటించింది. దీంతో తమ ఖాతాదారుల్లో కొంతమందికి అందించే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలిపింది. కాగ్నిజెంట్ ఐటీ సంస్థలో ఇండియాలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మేజ్ రాన్సమ్వేర్ దాడికి సంబంధించిన సమాచారాన్ని కాగ్నిజెంట్ తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు చేరవేయడంతో పాటు వారికి రక్షణాత్మక సాంకేతికత అదించింది.

అడ్డుకోవడంతో పాటు చట్టపరమైన చర్యల దిశగా
ప్రముఖ సైబర్ రక్షణ సంస్థలతో అనుసంధానమైన తమ అంతర్గత భద్రత బృందాలు ఈ దాడిని నిరోధించేందుకు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. ఖాతాదారులు తమ కంప్యూటర్ వ్యవస్థ, డేటాను వినియోగించకుండా రాన్సమ్వేర్ అడ్డుపడుతుందని తెలిపారు. ఈ డేటాను వినియోగించాలంటే డబ్బులు చెల్లించాలని సైబర్ దాడికి పాల్పడ్డవారు డిమాండ్ చేస్తారు. ఈ దాడిని అడ్డుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు కాగ్నిజెంట్ సిద్ధమవుతోంది.

కాగ్నిజెంట్ ప్రకటన
'మా ఇంటర్నల్ వ్యవస్థల భద్రతకు ముప్పు వాటిల్లింది. దీనివల్ల మాకున్న క్లయింట్లలో కొందరికి అసౌకర్యం కలుగుతుంది. ఇది మేజ్ ర్యాన్సమ్వేర్ దాడివల్ల జరిగింది' అని కాగ్నిజెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని ఎదుర్కొనేందుకు తమ సైబర్ రక్షణ బృందాలు శ్రమిస్తున్నాయన్నారు.

సమాచారం దొంగిలిస్తుంది..
ర్యాన్సమ్వేర్ సాధారణంగా యూజర్ల కంప్యూటర్లలోకి చొరబడి అందులోని విలువైన సమాచారాన్ని దొంగిలిస్తుంది. ఈ సమాచారాన్ని తిరిగి పొందాలంటే సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసిన డబ్బును ఇవ్వవలసి ఉంటుంది.
కాగ్నిజెంట్కు 80 దేశాల నుండి పెద్ద ఎత్తున క్లయింట్స్ ఉన్నారు. గత ఏడాది 16.8 బిలియన్ డాలర్ల రెవెన్యూను నమోదు చేసింది. కాగ్నిజెంట్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో కూడా కలిసి పని చేస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications