అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఉత్పత్తుల ధరలు పెరగడంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్తో పాటు ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (కంప్రెస్ట్ నేచరల్ గ్యాస్), గృహ అవసరాల కోసం వినియోగించ పైప్డ్ నేచరల్ గ్యాస్ (పీఎన్జీ) రేట్లు పెరిగాయి. ఈ మేరకు చమురు రంగ సంస్థలు మంగళవారం నుండి ఈ పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
సీఎన్జీ 70 పైసల వరకు, పీఎన్జీ , 91 పైసల వరకు పెంచుతున్నట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ తెలిపింది. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) మొత్తానికీ సీఎన్జీ, పీఎన్జీని సరఫరా చేసే సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL)కు అనుబంధంగా పని చేస్తుంది. ఈ ధరల పెంపు ప్రస్తుతం ఢిల్లీకి పరిమితమైంది. దశలవారీగా అన్ని నగరాల్లోనూ అమలు చేయనున్నాయి.

కొత్తగా సవరించిన రేట్ల ప్రకారం- ఢిల్లీలో సీఎన్జీ ధర 43.40కి, పీఎన్జీ ధర 28.41కు చేరుకుంది. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ ప్రకారం పీఎన్జీ ధరను వసూలు చేస్తారు. సవరించిన రేట్ల ప్రకారం నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లల్లో సీఎన్జీ కేజీ ఒక్కింటికి రూ.49.08, కాన్పూర్, హమీర్పూర్, ఫతేపూర్లల్లో రూ.60.50గా ఉంది. రెవారీ, కర్నాల్లల్లో పీఎన్జీ రేట్లు రూ.28.46, మీరట్లో రూ.32.67గా ఉంది. ఢిల్లీ-NCR, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, రేవారీ తదితర ప్రాంతాల్లో 16 లక్షల ఇళ్లకు ఇంద్రప్రస్థ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ను సరఫరా చేస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications