Hyderabad: ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతోంది. గత కొన్ని సంవత్సరాలు బలమైన నాయకత్వం ఉండటంతో మనదేశం చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తోంది. టెక్నాలజీ రంగంలో కీలక ఆవిష్కరణలు ఇందుకు మరింతగా దోహదపడుతున్నాయి.
ఏ దేశమైనా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించాలంటే రిస్క్ తీసుకోవడం తప్పనిసరి అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) అధ్యక్షుడు సంజీవ్ బజాజ్ అన్నారు. "సౌత్ ఇండియా@100: గోయింగ్ బియాండ్ బౌండరీస్" అనే అంశంపై జరిగిన CII వార్షిక ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.
రాబోయే దశాబ్దం భారతదేశానికి చెందినదని బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్ అన్నారు. దేశంలో శక్తివంతమైన ఇన్నోవేషన్ ఎకోసిష్టం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న 25 సంవత్సరాల్లో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి ఉంటుందని చెప్పారు.

25 సంవత్సరాల్లో డిజిటల్ ప్రపంచం రోజువారీ జీవితంలో సాంకేతికతను ఎక్కువగా అనుసంధానించడం ద్వారా వర్గీకరించబడుతుందని CII డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. 2047 డిజిటల్ ప్రపంచంలో మరింత ముఖ్యమైన పాత్రను చూస్తుందని అభిప్రాయపడ్డారు.
భారతదేశం ఆవిష్కరణల కోసం తన పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో గొప్ప పురోగతిని సాధిస్తోందని సీఐఐ ఛైర్పర్సన్ సుచిత్రా ఎల్లా వ్యాఖ్యానించారు. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో దాని మెరుగుదలలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. "గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో భారతదేశం 40వ స్థానంలో ఉందని ఆమె వెల్లడించారు. నాలెడ్జ్ క్రియేషన్, ఇంపాక్ట్, డిఫ్యూజన్ వంటి రంగాల్లో కూడా భారత్ మంచి పనితీరు కనబరిచిందని వెల్లడించారు. ఈ ఆవిష్కరణకు మద్దతిచ్చే తగిన మౌలిక సదుపాయాలను నిర్మించాలని ఆమె తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications