చైనా నుండి ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) గత మూడేళ్లుగా తగ్గుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 163.77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోకసభకు తెలిపారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత మూడేళ్లుగా చైనీస్ పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దులలో మూడేళ్లలో రెండోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకంటోంది. ఇటీవల హెచ్డీఎఫ్సీలోకి పెట్టుబడులు రావడంతో కీలక నిర్ణయం తీసుకుంది.

భారీగా తగ్గిన పెట్టుబడులు, కంపెనీలు స్వాధీనం చేసుకోకుండా
2019-20 ఆర్థిక సంవత్సరంలోకి FDIల రూపంలో దేశంలోకి రూ.163.77 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2017-18లో రూ.350.22 మిలియన్ డాలర్లు రాగా, 2018-19లో 229 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది 28.5 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం భారీగా తగ్గాయని తెలిపారు. అంతకుముందు రెండేళ్ల క్రితంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సగం కంటే ఎక్కువగా పడిపోయాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ కంపెనీలను చౌకగా స్వాధీనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

2020 క్యాలెండర్ ఏడాదిలో...
2020 క్యాలెండర్ ఇయర్లో భారత్లోకి 20.63 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో 27.57 మిలియన్ డాలర్లు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో FDI పాలసీను కేంద్రం కఠినతరం చేసిన విషయం తెలిసిందే. చైనా కంపెనీలు భారత కంపెనీలను చేజిక్కించుకునే ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా FDI పాలసీని కఠినతరం చేసింది. చైనా లక్ష్యంగా.. భారత్తో సరిహద్దులు పంచుకున్న దేశాల కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులను కఠినతరం చేసింది.

ఎఫ్డీఐ నిబంధనలకు లోబడి
నిషేధించిన రంగాలు, కార్యకలాపాలు మినహా ఎఫ్డీఐ విధానానికి లోబడి ప్రవాస సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చునని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే భారత్లో సరిహద్దు పంచుకునే లేదా ఆ దేశాలకు చెందినవారు లేదా సంస్థలు ప్రభుత్వ మార్గంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఉదాహరణకు పాకిస్తాన్కు చెందిన ఓ కంపెనీ లేదా పెట్టుబడిదారు రక్షణ, అంతరిక్షం, అణుశక్తితో పాటు ఇతర నిషేధించిన రంగాలు, కార్యకలాపాలు మినహా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చునని చెప్పారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications