న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ బకాయిలను కొద్దిసేపటి కిందటే మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రాలవారీగా ఎంత మొత్తాన్ని కేటాయించామనే విషయాన్నీ స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

21 రాష్ట్రాల బ్రేకప్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 21 రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను మంజూరు చేసినట్లు ఈ ప్రకటనలో తెలిపింది. దీని మొత్తం 86,912 కోట్ల రూపాయలు. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఘర్షణ వైఖరిని ప్రదర్శించింది.

జీఎస్టీ బకాయిల కోసం..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు- జీఎస్టీ బకాయిల విషయంలో పలుమార్లు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీ కొంత మెతక వైఖరిని కనపరిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తులు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పలుమార్లు నిర్మల సీతారామన్తో సమావేశం అయ్యారు.

పార్లమెంట్లో గళం..
బకాయిల చెల్లింపుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అటు పార్లమెంట్లోనూ గళమెత్తిన విషయం తెలిసిందే. వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి మొన్నటి వార్షిక బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. ఆయా పోరాటాలు, విజ్ఞప్తులు, విన్నపాలు మొత్తానికి ఫలించాయి. ఏపీ తెలంగాణకు చెల్లించాల్సిన జీఎస్టీ అరియర్స్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మొత్తంగా 21 రాష్ట్రాలకు ఈ జీఎస్టీ బకాయిలను చెల్లించింది.

ఏపీ, తెలంగాణ వాటా ఇదీ..
ఈ ఏడాది ఫ్రిబవరి-మార్చి నెలలకు చెల్లించాల్సిన బకాయిలు 21,322 కోట్ల రూపాయలు. జనవరి 2022 వరకు మంజూరు చేయాల్సిన మొత్తం 47,617 కోట్ల రూపాయలు. ఈ రెండింటినీ కలిపి ఏకమొత్తంలో విడుదల చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ వివరించింది. ఏపీ- రూ. 3,199 కోట్లు, తెలంగాణ- 296 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.

మహారాష్ట్ర టాప్..
మిగిలిన రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. అస్సాం- రూ.232 కోట్లు, ఛత్తీస్గఢ్-రూ.1,434 కోట్లు, ఢిల్లీ-రూ.8,032 కోట్లు, గోవా-రూ.1,291 కోట్లు, గుజరాత్-రూ.3,364 కోట్లు, హర్యానా-రూ.1,325 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.838 కోట్లు, జార్ఖండ్-రూ.1,385 కోట్లు, కర్ణాటక-రూ.8,633 కోట్లు, కేరళ-రూ.5,693 కోట్లు, మధ్యప్రదేశ్-రూ.3,120 కోట్లు, మహారాష్ట్ర-రూ.14,145 కోట్లు, పుదుచ్చేరి-రూ.576 కోట్లు, పంజాబ్-రూ.5,890 కోట్లు, రాజస్థాన్-రూ.963 కోట్లు, తమిళనాడు-9,602 కోట్లు, తెలంగాణ-రూ.296 కోట్లు, ఉత్తర ప్రదేశ్-8,874 కోట్లు, ఉత్తరాఖండ్-1,449 కోట్లు, పశ్చిమ బెంగాల్-రూ.6,591 కోట్లు మంజూరు అయ్యాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications