న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మొదట్లో కనిపించిన వ్యాక్సిన్ల కొరత ఇప్పుడు ఉండట్లేదు. రాష్ట్రాల్లో నెలకొన్న డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తోంది. రాష్ట్రాలన్నింటికీ ఉచితంగా వాటిని అందించే బాధ్యతను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అయ్యే ఖర్చును భరిస్తోంది. ఇప్పటిదాకా 40 కోట్లమందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు.
రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచిన తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టాలెక్కింది.. సజావుగా సాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్కు చెందిన ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను విస్తృతంగా వినియోగమౌతోంది. అదే సమయంలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను పరిమితంగా వినియోగిస్తోన్నారు.

కొన్ని డిజిగ్నేటెడ్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ వ్యాక్సిన్ను తీసుకునే వీలు ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ సేకరణ ధరను పెంచినట్లు వార్తలు వస్తోన్నాయి. కోవిషీల్డ్ డోసు ధరను 205 రూపాయలకు పెంచడంతో పాటు దానికి అదనంగా అయిదు శాతం జీఎస్టీని నిర్దేశించినట్లు తెలుస్తోంది. కోవాగ్జిన్ డోసు ధరను 215 రూపాయలు నిర్ధారించడంతో పాటు అయిదు శాతం జీఎస్టీని జత చేసినట్లు సమాచారం.
ఇదివరకు ఈ రెండు వ్యాక్సిన్ల సేకరణ ధర 150 రూపాయలుగా ఉండేది. దీనికి అయిదు శాతం జీఎస్టీ అదనం. ఈ ఏడాది డిసెంబర్ వరకు 37 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆర్డర్లను అందజేసింది. అదే సమయంలో- డిసెంబర్ వరకు 28.5 కోట్ల డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ను సేకరించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications