For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం

|

ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని. గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఈ సంవత్సరంలో (2021) 30,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. గత ఏడాది (2020)తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. కరోనా నేపథ్యంలో వ్యాపార అవకాశాలు బుల్లిష్‌గా ఉంటాయని ఈ ఫ్రెంచ్ కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఐటీ సంస్థల్లో నియామకాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దేశీయ దిగ్గజాలు కూడా కొత్త ఉద్యోగులను గతంలో కంటే ఎక్కువగా తీసుకునే ప్లాన్ చేస్తున్నాయి.

పన్నులు తగ్గించాలి! పెట్రోల్, డీజిల్ ధరలపై RBI కీలక వ్యాఖ్యలు, ఆ రాష్ట్రాల్లో ధరలు తక్కువేపన్నులు తగ్గించాలి! పెట్రోల్, డీజిల్ ధరలపై RBI కీలక వ్యాఖ్యలు, ఆ రాష్ట్రాల్లో ధరలు తక్కువే

ఫ్రెషర్స్, ఎక్స్‌‍పీరియన్స్‍‌‌కు

ఫ్రెషర్స్, ఎక్స్‌‍పీరియన్స్‍‌‌కు

ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు అవకాశం కల్పించనుంది క్యాప్‌జెమిని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్ అండ్ డీ, ఇంజనీరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో నియమాకలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువ అని క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. కోవిడ్ 19 నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్‌కు పెరిగిన భారీ డిమాండ్ తమ వ్యాపార తమ వ్యాపార అవకాశాలను మెరుగుపరిచిందన్నారు.

నియామకాలు - వృద్ధి

నియామకాలు - వృద్ధి

ఈ నియామకం 2021 సంవత్సరానికి గాను 7-9 శాతం మేరకు తమ బలమైన ఆదాయ వృద్ధికి మార్గదర్శకంగా మారుతుందని తెలిపారు. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌ 50 శాతం చొప్పున తీసుకుంటామన్నారు. కాగ్నిజెంట్‌కు భారత్‌లో 1,25,000 ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు 2,70,000. భారత్‌లోనే ఉద్యోగులు ఎక్కువ. 2020లో భారత్‌లో ఈ కంపెనీ 24,000 మంది ఉద్యోగులను నియమించుకుంది.

ఇతర ఐటీ కంపెనీలు కూడా..

ఇతర ఐటీ కంపెనీలు కూడా..

డిసెంబర్ క్వార్టర్‌లో క్యాప్‌జెమిని ఆదాయంలో 65% వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్ నుండి ఉంది. కరోనా నుండి కోలుకుంటున్నందున వ్యాపారం తిరిగి పుంజుకుంటుందని భారీ డీల్స్ వస్తాయని భావిస్తోంది. ఏప్రిల్ 2020లో కరోనా సమయంలోను వేతన పెంపు ప్రకటించింది. ఇతర ఐటీ దిగ్గజాల విషయానికి వస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24,000 మందిని తీసుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 మందిని తీసుకున్నది. కాగ్నిజెంట్ 23వేల ఉద్యోగులను తీసుకోనుంది. గత ఏడాదితో ఇది 35 శాతం అధికం.

English summary

గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం | Capgemini to hire 30,000 people in India in 2021

Capgemini plans to hire about 30,000 people in India in 2021, a 25% increase from last year, underscoring the French information technology (IT) services provider and consulting firm’s bullish business prospects amid a pandemic-induced surge in demand for digital solutions.
Story first published: Friday, February 26, 2021, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X