ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు ఐటీ రిటర్న్స్ కు సంబంధించి వాళ్ల హెచ్ ఆర్ నుంచి మెయిల్స్ వచ్చి ఉంటాయి. అయితే ఉద్యోగులు కొన్ని పథకాల్లో చేరడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. పన్ను మినహాయింపు లభించే పథకాల్లో పీపీఎఫ్(పబ్లిక్ ప్రవిడెంట్ ఫండ్) ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

కనీసం రూ.500
పీపీఎఫ్ అకౌంట్ ను పోస్టాఫీస్ లు, లేదా బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. అయితే ఒక్కరు ఒక్క అకౌంట్ మాత్రమే తీయాలి. ఈ పథకంలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో ఖాతా 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత ఐదు సంవత్సరాల చొప్పున దీన్ని పొడిగించుకోవచ్చు.

15 ఏళ్ల లాక్ఇన్ పీరియడ్
అయితే కొంత సమయం తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఖాతా నుంచి పాక్షికంగా నగదును తీసుకోవచ్చు. పీపీఎఫ్ 15 ఏళ్ల లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 5వ ఏడాది పూర్తయిన తరువాత పీపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కొద్దిగా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. పీపీఎఫ్ పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం 7.1 శాతం చొప్పున వడ్డీని అందిస్తోంది. ఏదైనా భారతీయ పౌరుడు ఎవరైనా పీపీఎఫ్లో ఖాతాను తెరవవచ్చు.

సెక్షన్ 80C
మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ.12,500 పెట్టుబడి పెడితే ఒక సంవత్సరంలో మీకు రూ.1.50 లక్షలు అవుతాయి. అంటే రోజుకు రూ.416 ఆదా చేసుకోవాలన్న మాట. అదే సమయంలో 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 40.70 లక్షలు అవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 18.20 లక్షల వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications